India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లాలో ప్రతి 10 గ్రామాలకు ఓ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల భూమి కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటుకు దీటుగా తయారు చేస్తామని చెప్పారు. దివ్యాంగుల రిజర్వేషన్పై చేసిన స్మిత సబర్వాల్ ట్వీట్ ఆమె వ్యక్తిగతమని అన్నారు. ఆమె ట్వీట్కు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళాశక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఎలిగేడు మండలం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. మహిళా శక్తి కార్యక్రమం, స్వశక్తి మహిళా సంఘాల రుణాలు వంటి పలు అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా డా.CHN.రాజకుమారి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో పేషంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నిరంతరం మెడికల్ టీమ్తో కలిసి సమష్టి కృషితో ముందుకు వెళ్తామన్నారు. చక్కటి వైద్యం, మెడికల్ విద్యకు టాప్ ప్రియారిటీ ఇస్తామన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా డా.CHN.రాజకుమారి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో పేషంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నిరంతరం మెడికల్ టీమ్తో కలిసి సమష్టి కృషితో ముందుకు వెళ్తామన్నారు. చక్కటి వైద్యం, మెడికల్ విద్యకు టాప్ ప్రియారిటీ ఇస్తామన్నారు.
తిరుమలాయపాలెం గ్రామంలో జ్వరం వచ్చి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామస్థుడు గొలుసు ఉమేశ్ కొడుకు అక్షిత్(6) LKG చదువుతున్నాడు. సోమవారం ఉదయం దాకా ఆడుకున్న బాలుడికి ఒక్కసారిగా జ్వరం సోకింది. ఫిట్స్ కూడా రావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లగా.. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం వద్ద విషాదం జరిగింది. స్నేహితులతో కలిసి సరదాగా జలపాతం చూసేందుకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన జశ్వంత్(19) అనే యువకుడు కొలనులో గల్లంతై మృతి చెందాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి ఎవరూ దిగొద్దని ఇప్పటికే అటవీశాఖ, పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల మాటలను పెడచెవిన పెట్టి జలపాతంలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు అంటున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ కాసేపు చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూలై 22 వరకు గడువు ఉండగా 26 వరకు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్థులు మీసేవ, TG ఆన్లైన్ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 20 నుంచి PG రెండో సంవత్సర పరీక్షలు, సెప్టెంబర్ 20 నుంచి PG మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి విద్యుత్నగర్లో విషాద ఘటన వెలుగుచూసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ (25) తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో మరో మట్టిమిద్దె కూలింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గద్వాల జిల్లా రాజోలి మండలం తూర్పు గార్లపాడుకు చెందిన మార్కు మట్టిమిద్దె నానింది. మంగళవారం తెల్లవారుజామున ఓ గది పైకప్పు కూలింది. ప్రమాద సమయంలో మార్కు, భార్య, పిల్లలతో కలిసి పక్క గదిలో పడుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో NGKL జిల్లాలో మిద్దెకూలి నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.