Telangana

News July 23, 2024

HYD: IAS స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై నిరసనలు..!

image

HYD అశోక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు రోడ్డెక్కారు. సీనియర్ IAS అధికారిణి స్మిత సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పే హక్కు స్మిత సబర్వాల్‌కు లేదని వారు మండిపడ్డారు. తమను ఆమె కించపరిచారని దివ్యాంగుల జాతీయ వేదిక నాయకులు రాము, రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

News July 23, 2024

ఉమ్మడి KNRలో చెరువులకు జలకళ

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి KNR జిల్లాలోని దాదాపు చెరువులన్నీ నిండు కుండలా మారి మత్తడి పోస్తున్నాయి. ఈ క్రమంలోనే గంగాధర మం.లోని నారాయణపూర్ చెరువు జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైపులైన్లతో చెరువుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సాగు నీటిని అందిస్తున్నారు. మీ గ్రామంలోని చెరువు నిండిందా? కామెంట్ చేయండి.

News July 23, 2024

HYD: రైల్వే టికెట్ల SCAM.. జర జాగ్రత్త..!

image

సికింద్రాబాద్ RPF బృందం ఆపరేషన్ ఉపలబ్ద్ చేపట్టింది. అక్రమ రైల్వే ఈ-టికెటింగ్ స్కామ్‌ పై ఉక్కుపాదం మోపింది. ఒకరిని అరెస్టు చేసి రూ.1.1 లక్షల విలువైన 37 ఈ-టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ టిక్కెట్లను విక్రయించే వారి మాయ మాటలకు బలైపోకండని, ఎల్లప్పుడూ సమాచారాన్ని ధ్రువకరించుకోవాలని పోలీసులు సూచించారు. అంతేకాక అదనపు మొత్తాన్ని చెల్లించకుండా ఉండాలని ప్రజలకు సూచించారు.

News July 23, 2024

HYD: రైల్వే టికెట్ల SCAM.. జర జాగ్రత్త..!

image

సికింద్రాబాద్ RPF బృందం ఆపరేషన్ ఉపలబ్ద్ చేపట్టింది. అక్రమ రైల్వే ఈ-టికెటింగ్ స్కామ్‌ పై ఉక్కుపాదం మోపింది. ఒకరిని అరెస్టు చేసి రూ.1.1 లక్షల విలువైన 37 ఈ-టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ టిక్కెట్లను విక్రయించే వారి మాయ మాటలకు బలైపోకండని, ఎల్లప్పుడూ సమాచారాన్ని ధ్రువకరించుకోవాలని పోలీసులు సూచించారు. అంతేకాక అదనపు మొత్తాన్ని చెల్లించకుండా ఉండాలని ప్రజలకు సూచించారు.

News July 23, 2024

సరస్వతి, లక్ష్మి బ్యారేజీలకు కొనసాగుతున్న వరద నీరు

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజ్, మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలకు వరద నీరు కొనసాగుతోంది. సరస్వతి బ్యారేజీకి 16,800 క్యూసెక్కుల నీరు రాగా, అంతే స్థాయిలో 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీకి 8,52,240 క్యూసెక్కుల వరద నీరు రాగా.. 85 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.

News July 23, 2024

సరస్వతి, లక్ష్మి బ్యారేజీలకు కొనసాగుతున్న వరద నీరు

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజ్, మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలకు వరద నీరు కొనసాగుతోంది. సరస్వతి బ్యారేజీకి 16,800 క్యూసెక్కుల నీరు రాగా, అంతే స్థాయిలో 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీకి 8,52,240 క్యూసెక్కుల వరద నీరు రాగా.. 85 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.

News July 23, 2024

HYD: లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు

image

డీజీపీ జితేందర్ రెడ్డి అధ్యక్షతన HYD నగరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు.

News July 23, 2024

HYD: లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు

image

డీజీపీ జితేందర్ రెడ్డి అధ్యక్షతన HYD నగరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు.

News July 23, 2024

JNTUలో ముగిసిన PHD పరీక్షలు

image

HYD కూకట్‌పల్లిలోని JNTUలో జరుగుతున్న PHD పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల్లో కలిపి మొత్తం 675 మంది పరీక్ష రాశారు. మొత్తం 930 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 72.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండోరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 400 మంది పరీక్ష రాసినట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్‌రావు చెప్పారు. నిబంధనలను అనుసరించి పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు.

News July 23, 2024

JNTUలో ముగిసిన PHD పరీక్షలు

image

HYD కూకట్‌పల్లిలోని JNTUలో జరుగుతున్న PHD పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల్లో కలిపి మొత్తం 675 మంది పరీక్ష రాశారు. మొత్తం 930 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 72.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండోరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 400 మంది పరీక్ష రాసినట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్‌రావు చెప్పారు. నిబంధనలను అనుసరించి పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు.