Telangana

News July 23, 2024

NZB: ఆ చెరువు 14 ఊర్లకు ఆదెరువు

image

ఇటీవల కురుస్తున్న వర్షాలకు మోపాల్‌లోని మంచిప్ప పెద్దచెరువు నిండింది. ఈ చెరువుపై 14 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఏటా పెద్ద చెరువు నిండి అలుగులు పారితే ముదక్‌పల్లి, కులాస్‌పూర్ చెరువుల్లోకి అక్కణ్నుంచి వడ్డెర కాలనీ, నర్సింగ్‌పల్లి, మోపాల్, సిర్పూర్, న్యాలకల్, ధర్మారం, మల్లారం, తదితర ప్రాంతాలకు వెళుతుంది. పెద్దచెరువు నీరు నర్సింగ్‌పల్లి ఫిల్టర్ బెడ్ శుద్ధి అయిన తర్వాత గాజుల్‌పేట్ ట్యాంకులోకి వెళ్తుంది.

News July 23, 2024

ADB: బడ్జెట్ సమావేశాలపై.. ఉమ్మడి జిల్లా వాసుల ఆశ!

image

కేంద్రబడ్జెట్, రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలపై ఈ ప్రాంతవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రబడ్జెట్లో భాగంగా జిల్లాకు దక్కేవరాల ప్రకటనపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోపక్క నేటినుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తామని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

News July 23, 2024

HYD: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన BRS ఎమ్మెల్యేలు

image

ఈరోజు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా గన్ పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, వివేకానంద తదితరులు హాజరుకానున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో లాస్య నందిత మృతిపై సంతాపం తెలపనున్నారు.

News July 23, 2024

HYD: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన BRS ఎమ్మెల్యేలు

image

ఈరోజు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా గన్ పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, వివేకానంద తదితరులు హాజరుకానున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో లాస్య నందిత మృతిపై సంతాపం తెలపనున్నారు.

News July 23, 2024

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,150 పలకగా.. నేడు రూ.7,180 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News July 23, 2024

HYD: గుర్రం తన్నింది.. యువకుడి మృతి

image

గుర్రం తన్నడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. HYD పాతబస్తీ పరిధి శాలిబండ PS ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాలు.. చాంద్రాయణగుట్ట వాసి ఇబ్రాహీం(17) ఈనెల 17న మొహర్రం ఊరేగింపు తిలకించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంజిన్ బౌలి ప్రాంతంలో గుర్రాలు వెళుతుండగా వాటి వెనుక పరిగెత్తాడు. ఒక గుర్రం తన్నడంతో అతడు గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.

News July 23, 2024

HYD: గుర్రం తన్నింది.. యువకుడి మృతి

image

గుర్రం తన్నడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. HYD పాతబస్తీ పరిధి శాలిబండ PS ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాలు.. చాంద్రాయణగుట్ట వాసి ఇబ్రాహీం(17) ఈనెల 17న మొహర్రం ఊరేగింపు తిలకించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంజిన్ బౌలి ప్రాంతంలో గుర్రాలు వెళుతుండగా వాటి వెనుక పరిగెత్తాడు. ఒక గుర్రం తన్నడంతో అతడు గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.

News July 23, 2024

HYD: బడ్జెట్ పైనే బల్దియా ఆశలు..!

image

బడ్జెట్ పైనే GHMC ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు SRDP, SNAP ప్రాజెక్టులతోపాటు రోడ్ల నిర్వహణ కోసం తెరపైకి తెచ్చిన CRMP కార్యక్రమాల కోసం బల్దియా రూ.6,500కోట్ల పైచిలుకు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వస్తున్న ఆదాయం అప్పులు, మిత్తీలు చెల్లించేందుకు కూడా చాలకపోవటంతో అధికారులు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు తలలు పట్టుకుంటున్నారు.

News July 23, 2024

HYD: బడ్జెట్ పైనే బల్దియా ఆశలు..!

image

బడ్జెట్ పైనే GHMC ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు SRDP, SNAP ప్రాజెక్టులతోపాటు రోడ్ల నిర్వహణ కోసం తెరపైకి తెచ్చిన CRMP కార్యక్రమాల కోసం బల్దియా రూ.6,500కోట్ల పైచిలుకు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వస్తున్న ఆదాయం అప్పులు, మిత్తీలు చెల్లించేందుకు కూడా చాలకపోవటంతో అధికారులు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు తలలు పట్టుకుంటున్నారు.

News July 23, 2024

శంషాబాద్: విమానం ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన!

image

విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. సోమవారం ఉదయం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం సమయానికి బయలుదేరలేదు. ఉదయం 8 గంటల వరకు కూడా విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఎయిర్ లైన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.