Telangana

News March 29, 2024

HYD: ‘ఆ ఒక్క సెకండ్.. ప్రాణాన్ని కాపాడుతుంది’

image

HYD వాహనదారులకు ఎల్లప్పుడూ రాచకొండ పోలీసులు డ్రైవింగ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో సూచన చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కేవలం ఒక్క సెకండ్ పడుతుంది. ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోరో..! ప్రమాదం జరిగినప్పుడు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఆ క్షణంలో సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని, వాహనంలో వెళ్లే అందరూ ధరించాలని సూచించారు.

News March 29, 2024

HYD: ‘ఆ ఒక్క సెకండ్.. ప్రాణాన్ని కాపాడుతుంది’

image

HYD వాహనదారులకు ఎల్లప్పుడూ రాచకొండ పోలీసులు డ్రైవింగ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో సూచన చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కేవలం ఒక్క సెకండ్ పడుతుంది. ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోరో..! ప్రమాదం జరిగినప్పుడు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఆ క్షణంలో సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని, వాహనంలో వెళ్లే అందరూ ధరించాలని సూచించారు.

News March 29, 2024

ప్చ్.. ఖమ్మంలో కాంగ్రెస్‌లో గెలవలేదు

image

ఖమ్మం MP స్థానాన్ని 2014లో YSRCP గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి పొంగులేటి గెలిచారు. 2019లో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) నుంచి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు హస్తం పార్టీకి నిరాశే ఎదురైంది. ఈసారి ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఖమ్మం MP సెగ్మెంట్ తమదే అని కాంగ్రెస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.

News March 29, 2024

MBNR: బీఆర్ఎస్ MLC అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ భయం..!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. క్యాంపులకు వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఓటు వేశారా లేదంటే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా అనే అంశంపై నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. విజయం సాధించాలంటే దాదాపు 725 ఓట్లు రావాల్సి ఉంది. ఫలితం కోసం ఏప్రిల్ 2 వరకు ఆగాల్సిందే.

News March 29, 2024

HYD: గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు

image

HYD తార్నాకలోని IICT గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు చేస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగం నియంత్రించడంపై దృష్టి సారించింది. క్లీన్ ఎనర్జీగా హైడ్రోజన్‌కు పేరున్న నేపథ్యంలో కోబాల్ట్ టెర్పరిడిన్ రసాయన మూలకాన్ని ఉపయోగించి వాణిజ్యపరంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.

News March 29, 2024

HYD: గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు

image

HYD తార్నాకలోని IICT గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు చేస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగం నియంత్రించడంపై దృష్టి సారించింది. క్లీన్ ఎనర్జీగా హైడ్రోజన్‌కు పేరున్న నేపథ్యంలో కోబాల్ట్ టెర్పరిడిన్ రసాయన మూలకాన్ని ఉపయోగించి వాణిజ్యపరంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.

News March 29, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

BJPతో కలిసి BRS పనిచేయనుందని స్వయంగా KTR చెప్పడంతోనే దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లో చేరానని ఖైరతాబాద్ MLA, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ.. BJPతో కలిస్తే BRS సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని తాను ప్రశ్నించానన్నారు. గతంలో KCR అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టమని కానీ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మీ కామెంట్?

News March 29, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థులకు పటాన్‌చెరు నేపథ్యం

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దిగుతున్న మూడు పార్టీల అభ్యర్థులు పటాన్‌చెరు నేపథ్యం కలిగి ఉన్నారు. మెదక్ పార్లమెంట్‌లో పటాన్‌చెరు నియోజకవర్గం ఒకటి కాగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు జర్నలిస్టుగా, న్యాయవాదిగా పనిచేయగా, కాంగ్రెస్ అభ్యర్థి చిట్కూల్ ఇటీవల సర్పంచ్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్‌ రామారెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు.

News March 29, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

BJPతో కలిసి BRS పనిచేయనుందని స్వయంగా KTR చెప్పడంతోనే దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లో చేరానని ఖైరతాబాద్ MLA, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ.. BJPతో కలిస్తే BRS సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని తాను ప్రశ్నించానన్నారు. గతంలో KCR అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టమని కానీ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మీ కామెంట్?

News March 29, 2024

కరీంనగర్: ప్రవేశాలకు ఈ నెల 31న ఆఖరు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దూర విద్య డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం (2023-24) ప్రవేశాలు అపరాధ రుసుం రూ.200తో ఈనెల 31 వరకు పొందే అవకాశం విశ్వవిద్యాలయం కల్పించింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఓపెన్ యూనివర్శిటీ కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.