Telangana

News September 27, 2024

పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లా తీర్చిదిద్దుతాం: తుమ్మల

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక గుమ్మంగా తీర్చిదిద్దుతామని, ఖమ్మం ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కిల్లా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సెక్రటేరియట్లో పర్యాటక అభివృద్ధిపై, ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన రోప్ వే పనులపై తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ తో మంత్రి సమావేశమయ్యారు. ఖమ్మం ఖిల్లా పై రోప్ వే నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టాలన్నారు.

News September 27, 2024

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జీవో తెచ్చింది నేనే: డీకే అరుణ

image

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు జీవో తెచ్చింది తానేనని, జీవో వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉదండాపూర్ భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఎంపీ డీకే అరుణ గురువారం అన్నారు. గత ప్రభుత్వం భూ నిర్వాసితు సరైన న్యాయం చేయలేదన్నారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీ అందించాలని ఆమె అన్నారు. సిగ్నల్ గడ్డ వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందని ఆమె అన్నారు.

News September 27, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

image

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

News September 27, 2024

ఆదిలాబాద్‌లో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

image

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులు కొనసాగించడానికి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP గౌష్ ఆలం తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో DSP ఆపై స్థాయి అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 27, 2024

సీఎం‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

image

హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.. మీరు కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

News September 27, 2024

కరీంనగర్: సంక్షేమ అధికారులు హాస్టల్లో నిద్ర చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని విద్యార్థి వసతి గృహాలను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. SC, ST, BC, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అధికారులు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్‌లో ఆమె సమావేశమయ్యారు. హాస్టల్‌లో రాత్రి నిద్ర చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మండల విద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు హాస్టళ్ళను సందర్శించాలన్నారు.

News September 27, 2024

సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

image

హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.. మీరు కూల్చివేతలతో పేరుతెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

News September 27, 2024

MLG: అడవి బిడ్డల అభివృద్ధికి అటవీశాఖ సహకరించాలి: మంత్రి సీతక్క

image

అడవి బిడ్డల అభివృద్ధికి అటవీశాఖ సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. పెసా చట్టంపై జాతీయ సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్థానిక ఆదివాసీ గిరిజ‌న ప్ర‌జ‌ల అభివృద్ది అవ‌స‌రాల కోసం గ్రామ స‌భ‌లు తీసుకున్న‌ నిర్ణ‌యాలు అమ‌లయ్యేలా చూడాల‌ని కోరారు. ఏజెన్సీ ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాల‌కు ఆటంకాలు క‌లిగించ‌కుండా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌ను స‌మ‌న్వ‌యం చేయాల‌ని చేయాలని కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి చేశారు.

News September 27, 2024

KMR: గడువులోగా బియ్యం అప్పగించని మిలర్లపై చర్యలు: కలెక్టర్

image

నిర్ణీత గడువులోగా CMR బియ్యం ప్రభుత్వానికి అప్పగించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సివిల్ సప్లై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 30లోగా బియ్యం సప్లై చేయకపోతే మిల్లర్లకు అపరాధ రుసుం విధించటంతో పాటు, ఈ వానాకాలం సీజన్‌కు వడ్లు కేటాయించమన్నారు.

News September 27, 2024

‘ఓపెన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి’

image

ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ అన్నారు. గురువారం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు జిల్లా నుంచి 340 మంది టెన్త్ అభ్యర్థులు, 373 మంది ఇంటర్ అభ్యర్థులు హాజరు కానున్నారని, ఈ పరీక్షలను సజావుగా నిర్వహించాలని సూచించారు.