India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికలు తెలిపిన వివరాలు.. మునుగోడు మండలం ఊకోండి శివారులో బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పింఛన్లు నేటి నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని పింఛనుదారులు గమనించి పోస్టాఫీసుల ద్వారా తమ పింఛన్లను పొందాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా పింఛన్ పొందాలని సూచించారు.
ఖమ్మం నగరంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ టీ స్టాల్ను మున్సిపల్ అధికారులు తొలగించారు. నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీ శ్రీ సర్కిల్ వద్ద 35 అడుగుల రోడ్డుపై ఏర్పాటు చేసిన టీ స్టాల్ను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, DRF సిబ్బందితో కలిసి తీసివేశారు. నగర శుభ్రత, వాహన రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడమే ఈ చర్యల ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేసుకున్నట్లు వివరించారు. తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.SHARE IT
ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేసుకున్నట్లు వివరించారు. తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.SHARE IT
పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ప్రజలకు సత్వర నయం చేకూర్చేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లలో ఉన్న 16 వర్టికల్స్ పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. వాటిని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఏఎస్పీ సురేందర్ ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ పక్కాగా జరగాలని అధికారులను మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి హౌసింగ్ పీడీ మాణిక్యం, డీపీఓ యాదయ్యతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ కార్యక్రమంపై సంబంధిత ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు నియమితులైన వెరిఫికేషన్ అధికారులకు సూచనలు చేశారు.
నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అవార్డు-2025కు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రాంమెాహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. స్వయం ప్రతిపత్తి హోదాలో ఉత్తమ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలో ఐదో స్థానం సాధించిందని పేర్కొన్నారు.
నేలకొండపల్లి మండలంలో గల జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం కేంద్రాన్ని, రాజేశ్వరపురంలోని రైస్ మిల్లును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, కాంటాలు, బిల్లులు వంటి అంశాలపై రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లర్లకు, అధికారులకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.