Telangana

News March 29, 2024

డిగ్రీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఖమ్మంలో గర్ల్స్ డిగ్రీ కాలేజీ, కొత్తగూడెంలో బాయ్స్ డిగ్రీ కాలేజీ ఉండగా, ఆర్‌డీసీ సెట్‌–2024 ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఖమ్మం కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.వీ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్‌ 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> మధిరలో ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పర్యటన
> వేంసూరు మండలం లక్ష్మీనారాయణపురంలో ఆంజనేయస్వామి ఆలయంలో వార్షికోత్సవ ఉత్సవాలు
> ఖమ్మం జిల్లాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాక
> తాగునీటి ఎద్దడిపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
> కొత్తగూడెంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం
> చింతూరులో టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం
> మణుగూరులో సీఐటీయూ సంతకాల సేకరణ

News March 29, 2024

HYD: నకిలీ వజ్రాన్ని విక్రయిస్తున్న ముఠా ARREST

image

రూ.3 కోట్ల విలువైన వజ్రాన్ని రూ.30 లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను HYD పాతబస్తీ హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.సౌత్‌వెస్ట్‌ DCP ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాలు.. ముంబైకి చెందిన బాలచంద్ర తులేరే(48), పాతబస్తీకి చెందిన ముస్తాబా అహ్మద్‌ఖాన్‌, సాజిద్‌ అలీతో కలిసి నకిలీ వజ్రం విక్రయించేందుకు గురువారం మల్లేపల్లికి వచ్చారు.స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.

News March 29, 2024

HYD: నకిలీ వజ్రాన్ని విక్రయిస్తున్న ముఠా ARREST

image

రూ.3 కోట్ల విలువైన వజ్రాన్ని రూ.30 లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను HYD పాతబస్తీ హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.సౌత్‌వెస్ట్‌ DCP ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాలు.. ముంబైకి చెందిన బాలచంద్ర తులేరే(48), పాతబస్తీకి చెందిన ముస్తాబా అహ్మద్‌ఖాన్‌, సాజిద్‌ అలీతో కలిసి నకిలీ వజ్రం విక్రయించేందుకు గురువారం మల్లేపల్లికి వచ్చారు.స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.

News March 29, 2024

నిర్మల్: స్నేహం, ప్రేమ.. సూసైడ్

image

నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్‌లో బుధవారం రైలు కింద పడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు ఇద్దరు నిజామాబాద్ నగరానికి చెందిన నందిని(20), శ్రీకాంత్ గా పోలీసులు గుర్తించారు. ఇరువురి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు తమ ప్రేమను కాదంటారని భావించి బాసరకు చేరుకున్నారు. రాత్రి 8.30లకు రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు.

News March 29, 2024

కాంగ్రెస్ కరీంనగర్ టికెట్ ఎవరికి?

image

కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 31న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు పేర్లు వినిపించగా.. కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ KNR, సిరిసిల్ల, సిద్దిపేట, HNK డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. బరిలో నిలిచేదెవరో కామెంట్?

News March 29, 2024

MBNR: హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌‌కు ఉండగా.. భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు పోలింగ్‌ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News March 29, 2024

ఖమ్మం: రోజూ రూ.1.50 కోట్లకు పైనే..

image

ఖమ్మం హెడ్‌ పోస్టాఫీస్‌లో నిత్యం రూ.1.50 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. పొదుపు పథకాలు, డిపాజిట్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, తపాలా జీవిత బీమా, మనియార్డర్లు , స్పీడ్‌ పోస్టులు, పార్సిళ్ల సేవలతో పాటు పాస్‌పోర్టు సేవలు, ఆధార్‌ సేవలు, స్టాంపుల విక్రయాలు వంటి వాటి ద్వారా ఈ లావాదేవీలు నమోదవుతున్నాయి. వీటితో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

News March 29, 2024

నల్గొండ: అభ్యర్థులు ఖరారు.. ప్రచారంలో బిజీ

image

నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నారు. వీరంతా ప్రచారంలో నిమగ్నం కానున్నారు.

News March 29, 2024

కాంగ్రెస్ చేతిలోకి గ్రేటర్ హైదరాబాద్?

image

గ్రేటర్ HYDలో కాంగ్రెస్ బలోపేతానికి ఆ పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. ఉమ్మడి RR జిల్లాలోని అనేక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా ఈనెల 30న GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మరికొందరు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరనున్నారు. దీంతో MIM సహకారంతో GHMCని తమ చేతిలోకి తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.