Telangana

News March 29, 2024

కాంగ్రెస్ చేతిలోకి గ్రేటర్ హైదరాబాద్?

image

గ్రేటర్ HYDలో కాంగ్రెస్ బలోపేతానికి ఆ పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. ఉమ్మడి RR జిల్లాలోని అనేక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా ఈనెల 30న GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మరికొందరు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరనున్నారు. దీంతో MIM సహకారంతో GHMCని తమ చేతిలోకి తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.

News March 29, 2024

జగిత్యాల జిల్లాలో 1,18,824 హెక్టార్ల వరి సాగు

image

జగిత్యాల జిల్లాలో 2023 – 24 సీజన్‌లో 1,18,824 హెక్టార్ల వరిసాగు జరిగిందని దీనికి గాను 565241 mts ల వరిధాన్యం కొనుగోలు కొరకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గురువారం తెలిపారు. ఈ యాసంగి సీజన్లో వరి ధరలు గ్రేడ్ ఎ 2203, కామన్ ధరలు 2183గా ఉన్నాయన్నారు. ఈ సీజన్‌కు గాను ఐకెపి 133, పీఎసీఎస్ 282, మెప్మా 1, మొత్తం 416 వరి కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు.

News March 29, 2024

ఎలక్షన్ వేళ ఉమ్మడి జిల్లాపై డేగ కన్ను

image

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. లోక్ సభ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తే గుర్తించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రత్యేకబృందానికి కేటాయించిన వాహనానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. ఈ బృందం రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అభ్యర్థుల ర్యాలీలు జరిగే చోటుకు వెళితే చాలు అవన్నీ కెమెరాలో రికార్డయి అధికారులకు సమాచారం పోతుంది.

News March 29, 2024

HYD: స్కై రూట్ విక్రమ్ ఆర్బిటాల్ TEST సక్సెస్

image

HYD ఆధారిత స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ తన విక్రమ్-1 రాకెట్ కక్షలో స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. ఆర్బిటాల్ రాకెట్‌కు కలాం-250గా పేరు పెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొపల్షన్ టెస్ట్‌బెడ్ వద్ద నిర్వహించినట్లు తెలిపింది. HYD నగరంలో ఏరోస్పేస్ స్టార్ట్ అప్ స్కై రూట్ పై పలుమార్లు మాజీ మంత్రి KTR ప్రశంసలు కురిపించారు.

News March 29, 2024

HYD: స్కై రూట్ విక్రమ్ ఆర్బిటాల్ TEST సక్సెస్

image

HYD ఆధారిత స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ తన విక్రమ్-1 రాకెట్ కక్షలో స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. ఆర్బిటాల్ రాకెట్‌కు కలాం-250గా పేరు పెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొపల్షన్ టెస్ట్‌బెడ్ వద్ద నిర్వహించినట్లు తెలిపింది. HYD నగరంలో ఏరోస్పేస్ స్టార్ట్ అప్ స్కై రూట్ పై పలుమార్లు మాజీ మంత్రి KTR ప్రశంసలు కురిపించారు.

News March 29, 2024

సంఘం అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా: ఎంపీ అర్వింద్

image

బుక్స్ పేపర్ అండ్ స్టేషనరీ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. గురువారం నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డులో నిర్మించనున్న సంఘం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యపాల్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

News March 29, 2024

సిరిసిల్ల: ఆధారాలు లేకుండా తరలిస్తే సీజ్ చేయండి: కలెక్టర్

image

ఎటువంటి ఆధారాలు లేకుండా రూ.50,000 మించి నగదు తరలిస్తే సీజ్ చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ స్టేజి వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం వాహనాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపించాలని అధికారులు ఆయన ఆదేశించారు.

News March 29, 2024

‘CMR చెల్లింపు లక్ష్యాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలి’

image

2023- 24 వానకాలం కష్టం మిల్లింగ్ రైస్ చెల్లింపు లక్ష్యాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరిచందన రైస్ మిల్లర్లను కోరారు. గురువారం ఆమె మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2023- 24 వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ ప్రతిరోజు 4000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు 50 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు.

News March 29, 2024

మెదక్: ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు

image

పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు సహకరించాలని సూచించారు.
SHARE IT

News March 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్. @ తాగునీటి కొరత లేకుండా చూడాలన్న జగిత్యాల కలెక్టర్. @ రాయికల్ మండలంలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. @ వేములవాడలో వైభవంగా శివ కళ్యాణం. @ చందుర్తి మండలంలో చోరీ. @ జగిత్యాల మండలంలో హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్. @ గంభీరావుపేట మండలంలో చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.