Telangana

News July 22, 2024

HYD: దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

image

HYDలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్‌లో మరో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. బాలిక అరుపులు విన్న స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

News July 22, 2024

HYD: దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

image

HYDలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్‌లో మరో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. బాలిక అరుపులు విన్న స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

News July 22, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రాయికల్ మండలంలో ఉరOసుకొని మహిళ ఆత్మహత్య.
@ కరీంనగర్ ప్రజావాణిలో 223 ఫిర్యాదులు.
@ సిరిసిల్లలో గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్.
@ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా.
@ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్న కరీంనగర్ కలెక్టర్.
@ రాయికల్ మండలంలో యువతి ఆత్మహత్య.
@ జగిత్యాల ప్రజావాణిలో 37 ఫిర్యాదులు.

News July 22, 2024

గాంధీ ఆస్పత్రిలో భారీగా బదిలీలు.. పేషంట్లపై ఎఫెక్ట్..!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది బదిలీ కావడంతో పేషంట్లకు అందించే వైద్య సేవలు, మెడికల్ స్టూడెంట్లపై ప్రభావం పడనుందని పలువురు భావిస్తున్నారు. 42మంది ప్రొఫెసర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తదితర డిపార్ట్‌మెంట్ల వైద్య​ సిబ్బందితో పాటు 23మంది నాన్​ మెడికల్ సిబ్బంది ట్రాన్స్​ఫర్​ అయినట్లు అధికారులు తెలిపారు.

News July 22, 2024

గాంధీ ఆస్పత్రిలో భారీగా బదిలీలు.. పేషంట్లపై ఎఫెక్ట్..!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది బదిలీ కావడంతో పేషంట్లకు అందించే వైద్య సేవలు, మెడికల్ స్టూడెంట్లపై ప్రభావం పడనుందని పలువురు భావిస్తున్నారు. 42మంది ప్రొఫెసర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తదితర డిపార్ట్‌మెంట్ల వైద్య​ సిబ్బందితో పాటు 23మంది నాన్​ మెడికల్ సిబ్బంది ట్రాన్స్​ఫర్​ అయినట్లు అధికారులు తెలిపారు.

News July 22, 2024

గోదావరిఖనిలో దారుణం.. అన్న చేతిలో తమ్ముడి హతం 

image

గోదావరిఖనిలో దారుణం జరిగింది. పోలీసుల ప్రకారం.. కృష్ణానగర్‌లో ఆత్మకూరి అనిల్ అనే వ్యక్తి అతడి తమ్ముడు సునీల్, తండ్రి ఓదెలతో ఘర్షణకు దిగి వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా.. తండ్రి ఓదెలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా వీరిమధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News July 22, 2024

సికింద్రాబాద్‌లో కోలాహలంగా ఫలహార బండ్ల ఊరేగింపు

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి సాగిన ఫలహార బండ్ల ఊరేగింపు ఆద్యంతం ఆకట్టుకుంది. బోనాల జాతరలో బోనం, రంగం తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం ఫలహార బండి ఊరేగింపు, రెజిమెంటల్ బజార్, మోండా మార్కెట్, టకారాబస్తీ, రాంగోపాల్‌పేట్, పాన్‌బజార్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఫలహార బండ్లను ఊరేగిస్తున్నారు. 

News July 22, 2024

సికింద్రాబాద్‌లో కోలాహలంగా ఫలహార బండ్ల ఊరేగింపు

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి సాగిన ఫలహార బండ్ల ఊరేగింపు ఆద్యంతం ఆకట్టుకుంది. బోనాల జాతరలో బోనం, రంగం తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం ఫలహార బండి ఊరేగింపు, రెజిమెంటల్ బజార్, మోండా మార్కెట్, టకారాబస్తీ, రాంగోపాల్‌పేట్, పాన్‌బజార్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఫలహార బండ్లను ఊరేగిస్తున్నారు.

News July 22, 2024

మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

image

నకిరేకల్ మున్సిపాలిటీ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌పై నల్గొండ కలెక్టర్‌కు 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్‌కి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి 12 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు నుంచి ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీనీ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

News July 22, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,69,325 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,466, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.13,575, అన్నదానం రూ.1,10,283 వచ్చినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.