Telangana

News July 22, 2024

పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదు: మహేశ్వర్ రెడ్డి

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిన్‌ బ్యాంక్‌ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్‌ బ్యాంకు లేదని, ఆ బ్యాంకు గ్యారంటీలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

News July 22, 2024

రేపు MBNR జిల్లాకు కల్కి బుజ్జి కారు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు కల్కి సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, కల్కిలో ముఖ్యపాత్ర పోషించిన బుజ్జి కార్ రాబోతోందని తెలిపారు. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమా భారీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

News July 22, 2024

కరీంనగర్‌లో కొనసాగుతున్న ఉచిత గ్రాండ్ టెస్టులు

image

గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు 5వ రోజు ప్రశాంతంగా జరిగినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రవి కుమార్ తెలిపారు. మొత్తం 4 గ్రాండ్ టెస్టులు, 16 పరీక్షలు ఉంటాయన్నారు. కరీంనగర్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సోమవారం 50 మంది హాజరైనట్లు వెల్లడించారు. 3వ గ్రాండ్ టెస్టు జులై 23న, 4వ గ్రాండ్ టెస్టు జులై 30, 31 తేదీల్లో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు టెస్టులు ఉపయోగించుకోవచ్చన్నారు.

News July 22, 2024

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: కలెక్టర్

image

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్
సి.నారాయణరెడ్డి అన్నారు.
విధులలో సమయపాలన పాటించాలని, పనిలో నాణ్యత ఉండాలని అన్నారు. రెగ్యులర్ పనులతో పాటు, ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో జాప్యం చేయవద్దని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 

News July 22, 2024

కడెం ప్రాజెక్టు అప్డేట్.. 3380 క్యూసెక్కుల నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టు నుంచి 3380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా సోమవారం సా. 5 గంటలకు ప్రాజెక్టులో 691.22 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ప్రాజెక్టులోకి 4855 క్యూసెక్కుల నీరు వస్తోందని, దీంతో ఒక గేటు ఎత్తి ఎడమ కాలువకు 298, కుడి కాల్వకు 8, గోదావరిలోకి 2,997 క్యూసెక్కులు మొత్తం 3,380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.

News July 22, 2024

బీ.ఎడ్. విద్యార్థులకు సూచన: పరీక్షల ఫీజు తేదీ ప్రకటన

image

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. నాల్గవ సెమిస్టరు, రెగ్యులర్ 1వ, 2వ, 3వ, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు ఆగస్టు 1వ తేదీ లోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య.ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రూ.100 అపరాధ రుసుముతో 02-8-2024 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు వివరించారు.

News July 22, 2024

రేపు MBNR జిల్లాకు కల్కి బుజ్జి కారు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు కల్కి సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, కల్కిలో ముఖ్యపాత్ర పోషించిన బుజ్జి కార్ రాబోతోందని తెలిపారు. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమా భారీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

News July 22, 2024

మెదక్: ప్రజావాణికి 136 దరఖాస్తులు

image

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 136 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూములకు సంబంధించి 36, పెన్షన్లకు సంబంధించి 8, డబుల్ బెడ్ రూమ్‌లకు సంబంధించి 18, రుణమాఫీకి సంబంధించి 7, ఇతర సమస్యలకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 22, 2024

కేంద్ర మంత్రితో సీఎం రేవంత్, మంత్రులు భట్టి, ఉత్తమ్ భేటీ 

image

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు. 

News July 22, 2024

కేంద్ర మంత్రులను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి

image

పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి ఉత్తమ్ కలిశారు. తెలంగాణ‌లో రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న విష‌యాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగ‌దారుల‌కు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు (ఓఎంసీ) చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.