Telangana

News March 28, 2024

HYD:రంజాన్ వేళ.. డ్రై ఫ్రూట్స్‌కు FULL డిమాండ్

image

రంజాన్ వేళ HYD నగరంలో డ్రై ఫ్రూట్స్‌కు డిమాండ్ పెరిగింది. HYD దేశంలోనే ఖర్జూరాలను అధికంగా అవిక్రయించే నగరంగా పేరుగాంచింది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జురాలను విక్రయిస్తారు. దాదాపు బేగంబజార్లో 40 రకాల ఖర్జూరాలు విక్రయిస్తుండగా.. కిమియా , షికారి, కూద్రి, మజాపాతి, కాల్మీ ప్రసిద్ధిగాంచినవి. మరోవైపు అమెరికా, అరబ్ దేశాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి HYD నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి.

News March 28, 2024

KNR: అదృశ్యమయ్యాడు.. శవమై కనిపించాడు!

image

అదృశ్యమైన ఓ యువకుడు బావిలో శవమై తేలిన ఘటన KNR జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. CI స్వామి వివరాల ప్రకారం.. BHPL జిల్లా కాటారం మండలానికి చెందిన అభిలాశ్(20) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా చేస్తున్నాడు. అయితే ఈనెల 1న రాత్రి అభిలాశ్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో స్థానికంగా ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించగా.. చరవాణి, దుస్తుల ఆధారంగా అభిలాశ్‌గా పోలీసులు గుర్తించారు.

News March 28, 2024

ఆత్మకూరు: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండలంలోని పారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టూరి శివ కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. బుధవారం ఉదయం పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం HYD కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News March 28, 2024

చర్ల: ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్

image

మద్యం తాగి విధులకు హాజరైన చర్ల మండలం జీపీ పల్లి పాఠశాల <<12938027>>ప్రధానోపాధ్యాయుడు <<>>బానోత్ కృష్ణను సస్పెండ్ చేస్తూ డీఈఓ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ తెలిపారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్, మద్యం తాగి పాఠశాలకు రావడమే కాకుండా, విద్యార్థులను కొట్టాడు. దీంతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడిని నిర్బంధించిన విషయం తెలిసింది. విచారణ చేపట్టిన డీఈఓ సస్పెండ్ చేశారు.

News March 28, 2024

HYD: మామిడి పండ్లు కొంటున్నారా..? జాగ్రత్త!

image

HYD నగరంలో వేసవి వేళ మామిడి పండ్ల క్రయ విక్రయాలు పెరిగాయి. ఇదే అదునుగా వ్యాపారులు మామిడికాయ త్వరితగతిన పక్వానికి రావడానికి కెమికల్ ప్యాకెట్లను కాయల మధ్య ఉంచుతున్నారు. ఇలా చేసి పండించిన పండ్లను తినడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శివలీల తెలిపారు. కాగా ఇటీవలే బాటసింగారంలో వేలాది పండ్లను సీజ్ చేశారు. మామిడి పండ్లు కొనేటప్పుడు జర జాగ్రత్త..!

News March 28, 2024

HYD: మామిడి పండ్లు కొంటున్నారా..? జాగ్రత్త!

image

HYD నగరంలో వేసవి వేళ మామిడి పండ్ల క్రయ విక్రయాలు పెరిగాయి. ఇదే అదునుగా వ్యాపారులు మామిడికాయ త్వరితగతిన పక్వానికి రావడానికి కెమికల్ ప్యాకెట్లను కాయల మధ్య ఉంచుతున్నారు. ఇలా చేసి పండించిన పండ్లను తినడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శివలీల తెలిపారు. కాగా ఇటీవలే బాటసింగారంలో వేలాది పండ్లను సీజ్ చేశారు. మామిడి పండ్లు కొనేటప్పుడు జర జాగ్రత్త..!

News March 28, 2024

వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య చేపట్టిన అధికారులు ప్రశాంతంగా ముగించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తన చాంబర్ నుండి పర్యవేక్షిస్తున్నారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సూచనలిచ్చారు.

News March 28, 2024

వేడెక్కిన మెదక్‌ లోక్‌సభ రాజకీయం

image

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురువైంది. ఇరు పార్టీలనేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ BRS నేతలు సెటైర్లు వేశారు.

News March 28, 2024

కాటారం: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

News March 28, 2024

NZB: రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష

image

రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి 8 నెలల జైలుశిక్ష విధిస్తూ రైల్వే మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జూలు శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన గజం సత్యం కలిసి కామారెడ్డి, నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లలో 9 సెల్‌ఫోన్లు దొంగలించారని సాయిరెడ్డి వివరించారు.