India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన బంటు లావణ్యను మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన బంటు నారాయణతో వివాహం జరిగింది. అయితే భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ తెలిపారు.
ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ అవసరమైన వారికి తపాలా శాఖ ద్వారా ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి ఆధార్ నమోదు సేవలను అందిస్తున్నట్లు తపాల శాఖ డివిజన్ పర్యవేక్షకుడు రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 9553062368 నంబర్కు సంప్రదించాలన్నారు. ఎందుకు మున్సిపల్, పంచాయతీ లేదా ఆస్పత్రిలో పొందిన జనన ధ్రువీకరణ పత్రాన్ని తపాల సిబ్బందికి చూపించాలన్నారు. దీని ద్వారా పోర్టల్లో వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు
వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాల్లో ఆరు ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలంలో 42.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా సత్నాలలో 42.3, చాప్రాలలో 42.1, ఆసిఫాబాద్లో 42.0 , అర్లి(టి)లో 42.0, దస్తురాబాద్ మండలంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం శాలిగౌరారం. యూత్ కాంగ్రెస్ రాజకీయాలతో రాజకీయ అరంగ్రేటం చేశారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2007లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కోటరీలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు.
భార్యను వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై పాల్వంచ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు ప్రకారం.. కేశవాపురం గ్రామానికి చెందిన రమ్యకు శివకృష్ణతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ రమ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ కేసు నమోదు చేశారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని సూచించింది.
ఉమ్మడి పాలమూరు జిల్లా త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో పేరుపొందిన రామన్ పాడ్ జలాశయం అడుగంటి పోతుంది. గత సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురువకపోవడంతో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సాగు త్రాగునీటికి ఇబ్బందికరంగా మారింది. వర్షాలు లేక ప్రాజెక్టులో నీరు లేక రామన్ పాడ్ జలాశయంపై ఆధారపడిన గ్రామాలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్ను ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని సూచించింది.
2006లో పటాన్చెరు మండలం చిట్కుల్ జీపీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో ఉపసర్పంచ్గా, 2014లో ZPTC ఎన్నికలలో TRS పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానం చిట్కుల్ గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2023 పటాన్చెరు అసెంబ్లీకి BSP పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ సాధించాడు.
Sorry, no posts matched your criteria.