Telangana

News March 28, 2024

NZB: పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్

image

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు టీఎస్ఎస్సీ స్టీడీ సర్కిల్, షెడ్యూల్డ్ కులాల అభివృది శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. డిగ్రీ అర్హత ఉన్న ఎస్సీ అభ్యర్థుల దీనికి అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News March 28, 2024

సురక్ష సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ఐజి 

image

హన్మకొండ జిల్లా కాజిపేట్‌లోని ఆర్పీఎఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బందికి సురక్ష సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్పీఎఫ్ ఐజి & PCSC, SCR-అరోమా సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆర్పీఎఫ్ హాస్పిటల్‌ని సందర్శించారు. సమన్యాయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ సిఐ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

News March 28, 2024

సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం: హరీశ్ రావు

image

సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం ఈనెల 29న మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలోని ఓ గార్డెన్‌లో 3వేల మందితో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయంతో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశానికి తరలివచ్చేలా చూడాలన్నారు.

News March 28, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఓట్లు కీలకం!

image

ఉమ్మడి MBNR జిల్లాలో బుధవారం జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో BJP ఓట్లు కీలకం కానున్నాయి. మొత్తం 1,439 ఓట్లలో దాదాపు 119 ఓట్లు BJPకి ఉన్నాయి. ఎన్నికల్లో BJP అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓట్లు ఏ పార్టీకి పడతాయోనని రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది. కొంతమంది కాంగ్రెస్, మరి కొంతమంది BRS వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావితం చూపే అవకాశం ఉంది.

News March 28, 2024

NZB: ఎన్నికల వేళ పోలీసుల ప్రత్యేక నిఘా

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో డబ్బు, మద్యంఅక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంపై పోలీసుశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగానే నిజామాబాద్ డివిజన్‌లోని చంద్రశేఖర్ కాలనీ SST చెక్‌పోస్ట్, కంఠేశ్వర్ టెంపుల్, వర్ని ‘X’ రోడ్, SST చెక్‌పోస్ట్, మద్దుల్ ‘X’ రోడ్ SST చెక్‌పోస్ట్, బోధన్ డివిజన్‌లోని ఖండ్‌గాం అంతరాష్ట్ర చెక్‌పోస్ట్, సాలురా అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులు విస్తృతవాహన తనిఖీలు చేపట్టారు.

News March 28, 2024

HYDలో రాముడి శోభాయాత్ర‌కు భారీ ప్లాన్..!

image

శ్రీ రామనవమికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. 20 రోజుల ముందే‌ ఆయా ఆలయా‌ల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధూల్‌పేటలో‌ నిర్వహించే రాముడి శోభాయాత్రకు తరలిరావాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశ్‌పురి హనుమాన్‌ టెంపుల్‌ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. యాత్ర‌ను విజయవంతం చేయాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో‌ షేర్ చేస్తున్నారు.

News March 28, 2024

HYDలో రాముడి శోభాయాత్ర‌కు భారీ ప్లాన్..!

image

శ్రీ రామనవమికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. 20 రోజుల ముందే‌ ఆయా ఆలయా‌ల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధూల్‌పేటలో‌ నిర్వహించే రాముడి శోభాయాత్రకు తరలిరావాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశ్‌పురి హనుమాన్‌ టెంపుల్‌ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. యాత్ర‌ను విజయవంతం చేయాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో‌ షేర్ చేస్తున్నారు.

News March 28, 2024

జిల్లాలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

image

జిల్లాలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు సూచించారు.

News March 28, 2024

’18 నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోండి’

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అర్హులైన యువత ఏప్రిల్ 15లోగా ఓటర్లుగా పేరు నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి ఫారం-6లో వివరాలు నమోదు చేసి ఆన్లైన్ లేదా నేరుగా సంబంధిత ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

News March 28, 2024

నిర్మల్ : సీఎంఆర్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్

image

ప్రభుత్వం సూచించిన గడువులోగా (సీఎంఆర్) కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రైస్‌మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సీఎంఆర్ లక్ష్యాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాల పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ 2023-24 సంవత్సరం లక్ష్యాలను గడువులోగా వెంటనే పూర్తి పూర్తిచేయాలని తెలిపారు