Telangana

News March 27, 2024

వనపర్తి: ‘యాప్‌లో రూ.1,75,000 పోగొట్టుకున్నాడు’

image

వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ వేక్ (WAKE) యాప్‌లో రూ.1, 75,000 పోగొట్టుకున్నాడని ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. బాధితుడు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇచ్చారని చెప్పారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News March 27, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే ఈ సారి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటు రాత్రి వేళల్లో ఉక్కపోత కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు.

News March 27, 2024

మెదక్: అత్తను హతమార్చిన అల్లుడు

image

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూరులో దుబ్బగళ్ల సంగమ్మ (44)ను వరసకు  అల్లుడు హత్య చేసినట్లు అల్లాదుర్గం CI రేణుక రెడ్డి, SI మురళి తెలిపారు. ఈ నెల 20న సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మర్వెల్లికి చెందిన మల్లగుల్ల యేసు ఆమె ఇంటికి వచ్చాడు. రాత్రి ఆస్తి కోసం సంగమ్మను యేసు హత్య చేసి, ఆభరణాలు తీసుకొని పారిపోయినట్లు వివరించారు. ఈరోజు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

News March 27, 2024

మిర్యాలగూడ : హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు..?

image

మిర్యాలగూడ పట్టణంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తోంది. మూడు ఇళ్లపై బుధవారం పోలీసులు దాడి చేసి పదిమంది మహిళలతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో అనుమానాస్పద ఇండ్లలో తనిఖీలు చేసి 11 మందిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్న సూత్ర, పాత్రధారులు ఎవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

News March 27, 2024

‘సూర్యాపేట’ ఇక కనుమరుగేనా..?

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెర మీదకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల కుదింపులో సూర్యాపేట జిల్లా తొలగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

News March 27, 2024

భైంసా: ఎలక్షన్ వేళ డేగ కన్ను

image

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. లోక్‌సభ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తే గుర్తించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రత్యేకబృందానికి కేటాయించిన వాహనానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. ఈ బృందం రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అభ్యర్థుల ర్యాలీలు జరిగే చోటుకు వెళితే చాలు అవన్నీ కెమెరాలో రికార్డయి అధికారులకు సమాచారం పోతుంది.

News March 27, 2024

NZB: KTRపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

image

సీఎం రేవంత్‌పై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ బుధవారం నిజామాబాద్ 1టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ పాలన సాగిస్తున్నారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

News March 27, 2024

ALERT.. పాలమూరులో తీవ్రమవుతున్న ఎండలు

image

ఉమ్మడి పాలమూరులో భానుడి భగభగలు మరింత తీవ్రమవుతున్నాయి. జిల్లాలో గరిష్ఠంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా ఆరు బయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా కొబ్బరినీళ్లు తీసుకోవాలని తెలిపారు.

News March 27, 2024

గుమ్మడిదల: మహిళ హత్య.. దొంగ స్వామీజీ అరెస్టు

image

పూజలు చేస్తామని నమ్మించి మహిళను హత్య చేసిన దొంగ స్వామీజీని అరెస్టు చేసినట్లు జిన్నారం సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొంతపల్లికి చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేసే మంచి జరుగుతుందని దొంగ స్వామీజీ శివ నమ్మించాడు. ఫిబ్రవరి 13న హత్య చేసి 4.3 తులాల బంగారం దొంగిలించాడు. పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

News March 27, 2024

భద్రాచల రామాలయ హుండీ లెక్కింపు పూర్తి

image

భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నేడు హుండీ లెక్కింపు జరిపారు. 26 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.71, 22, 878, అన్నదానం ఆదాయం 1,61,100, గోశాలకు రూ. 1,95,363 మొత్తం ఆదాయం రూ. 74,79,341 ఆదాయం లభించినట్లు ఈవో రమాదేవి తెలిపారు. యూఎస్ డాలర్స్ 270, కెనడా డాలర్స్ 50, మలేషియా 20, వియత్నం 2000 లభించినట్లు ప్రకటించారు. ఈ మొత్తం బ్యాంకు అధికారులకు జమ చేశామని ఏఈఓ భవాని, రామకృష్ణ, ఆలయఅధికారులన్నారు.