Telangana

News July 21, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని TOP న్యూస్

image

◆ ఆసిఫాబాద్ : ప్రమాదపు అంచున అడ ప్రాజెక్టు
◆ నిర్మల్ : సొంత ఇంట్లోనే చోరీ.. భర్త అరెస్ట్
◆ సిర్పూర్ : అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
◆ ఆదిలాబాద్ : ఎనిమిది మంది పేకటారాయుళ్లు అరెస్ట్
◆ దహెగం : వాగులో వ్యక్తి మృతదేహం లభ్యం
◆ బెజ్జూర్ : భారీ వర్షాలతో 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
◆ ఉట్నూర్ : చిన్నారికి జ్వరం ప్రమాదకరంగా వాగు దాటుతూ
◆ నిర్మల్ : గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం
★ భారీ వర్ష సూచన

News July 21, 2024

కడెం ప్రాజెక్టు అప్డేట్.. 10 వేల క్యూసెక్కుల నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టు ద్వారా దిగువకు 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గడంతో కడెం ప్రాజెక్టులోకి ఆదివారం రాత్రి 10 గంటలకు 6,941 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టులోని రెండు గేట్ల ద్వారా కుడి, ఎడమ కాలువలతో పాటు దిగువ గోదావరిలోకి మొత్తం 10,545 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గడంతో కడెం ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరు తగ్గింది.

News July 21, 2024

ఆదిలాబాద్ ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

image

జిల్లాలో గత రెండు రోజులుగా భారీ నుండి అతిభారీ వర్షాల కురుస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదల కారణంగా నష్టాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలోని చెరువు కట్టలు కుంటలు తెగిపోకుండ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకుండ చర్యలు తీసుకోవాలన్నారు.

News July 21, 2024

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

image

కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పాతపాట పాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్‌ అవాకులు చెవాకులు పేలి.. తన అవగాహన రాహిత్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

News July 21, 2024

సౌదీలో బేగంపేట వాసి మృతి

image

బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన రాగి రవి (55) అనే వ్యక్తి సౌదీలో ఈనెల 13న అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాగి రవి గత 16 ఏళ్లుగా సౌదీలో ఉంటున్నాడు. అక్కడ గొర్ల కాపరి, వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం స్వగ్రామానికి వచ్చి మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన అనారోగ్యంతో మృతిచెందినట్లు అక్కడి ఆయన స్నేహితుల ద్వారా తెలిసింది.

News July 21, 2024

మాక్లూర్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

జీవితంపై విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మాక్లూర్ ఎస్ఐ సుదీర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాణిక్ భండార్ తండాకు చెందిన 20 ఏళ్ల యువతికి చిన్న నాటి నుంచి కళ్ళు సరిగ్గా కనిపించవని, మానసిక స్థితి కూడా సరిగ్గా లేదన్నారు. దీనితో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు.

News July 21, 2024

NGKL: UPDATE.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం

image

చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ <<13676667>>ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా.. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

News July 21, 2024

HYD: లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. జాగ్రత్త..!

image

రైతు రుణమాఫీ పేరిట సైబర్ నేరస్థులు కొత్త పంథాలో బ్యాంకు ప్రొఫైల్ పేరిట వాట్సప్ ద్వారా మెసేజెస్, APK ఫైల్స్ పంపిస్తున్నారని HYD రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు. APK ఫైల్ లింక్ క్లిక్ చేస్తే సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని, తద్వారా గూగుల్, ఫోన్‌పే లాంటివి ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తున్నారన్నారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News July 21, 2024

HYD: లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. జాగ్రత్త..!

image

రైతు రుణమాఫీ పేరిట సైబర్ నేరస్థులు కొత్త పంథాలో బ్యాంకు ప్రొఫైల్ పేరిట వాట్సప్ ద్వారా మెసేజెస్, APK ఫైల్స్ పంపిస్తున్నారని HYD రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు. APK ఫైల్ లింక్ క్లిక్ చేస్తే సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని, తద్వారా గూగుల్, ఫోన్‌పే లాంటివి ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తున్నారన్నారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News July 21, 2024

HYD: 2 నిమిషాల్లో స్కానింగ్.. ఇక చాలా ఈజీ

image

గ్రేటర్ HYDలో వర్షం వచ్చినప్పుడు వరద నీటి లోతుల్లోని వాహనాలను, వాహనాల్లో చిక్కుకున్న మనుషులను గుర్తించడం హ్యాండ్‌హెల్డ్ సోనర్ స్కానర్‌తో ఈజీ కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. దాదాపు 164 అడుగుల లోతు వరకు వెళ్తుంది. 2 నిమిషాల్లో 43 వేల చదరపు అడుగుల వరకు స్కాన్ చేసి, నీటి లోపల ఉన్న వాటి చిత్రాలను పంపిస్తుంది. త్వరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతుంది.