Telangana

News March 27, 2024

HYD: మోసం చేసి కాంగ్రెస్ గెలుస్తుందా?: మల్లారెడ్డి

image

మేమే గెలుస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారని, మళ్లీ ఎట్లా గెలుస్తారని, మోసం చేసి గెలుస్తారా అని మేడ్చల్ MLA మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తూ ఈరోజు మల్కాజిగిరిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP నేతలు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో BRSదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేడర్ లేదని ఎద్దేవా చేశారు.

News March 27, 2024

HYD: మోసం చేసి కాంగ్రెస్ గెలుస్తుందా?: మల్లారెడ్డి

image

మేమే గెలుస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారని, మళ్లీ ఎట్లా గెలుస్తారని, మోసం చేసి గెలుస్తారా అని మేడ్చల్ MLA మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తూ ఈరోజు మల్కాజిగిరిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP నేతలు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో BRSదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేడర్ లేదని ఎద్దేవా చేశారు.

News March 27, 2024

MBNR: మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయం: డీకే అరుణ

image

గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో ఓట్లు వేశారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. జడ్చర్ల‌లో బీజేపీ పార్లమెంటు నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మోడీని చూసి ఓట్లు వేస్తారని అన్నారు. మళ్లీ మూడోసారి మోదీ ప్రధాని అవుతారని అన్నారు.

News March 27, 2024

పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి

image

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల మమత, కుమార్ ల కుమారుడైన ముక్కర్ల ఉమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గం.లకు కట్లపాము కాటు వేయడంతో భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

News March 27, 2024

HYD: ఆక్రమణలు గుర్తించేందుకు మూసీలో డ్రోన్లతో సర్వే

image

మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (MRDCL) దృష్టి సారించింది. నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు. FTLతో పాటు బఫర్ జోన్‌లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేస్తారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GSI)తో అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు.

News March 27, 2024

HYD: ఆక్రమణలు గుర్తించేందుకు మూసీలో డ్రోన్లతో సర్వే

image

మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (MRDCL) దృష్టి సారించింది. నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు. FTLతో పాటు బఫర్ జోన్‌లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేస్తారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GSI)తో అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు.

News March 27, 2024

హైదరాబాద్: ఈ ఆటో.. సీఎం క్యాబ్!

image

ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నాడు. HYDలో తిరుగుతున్న ఈ ఆటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అల్వాల్‌కు చెందిన ఓం ప్రకాశ్‌ తన ఆటోపై వరి విత్తనాలు వేసి, నీళ్లు చల్లుతూ ఆటో లోపల చల్లగా ఉండేలా జాగ్రత్త పడుతూ ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాడు. సీఎం క్యాబ్ (కామన్ మ్యాన్) పేరును ఆటో వెనుక రాసుకొని తిరుగుతూ చల్లని సేవలు అందిస్తున్నాడు.

News March 27, 2024

హైదరాబాద్: ఈ ఆటో.. సీఎం క్యాబ్!

image

ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నాడు. HYDలో తిరుగుతున్న ఈ ఆటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అల్వాల్‌కు చెందిన ఓం ప్రకాశ్‌ తన ఆటోపై వరి విత్తనాలు వేసి, నీళ్లు చల్లుతూ ఆటో లోపల చల్లగా ఉండేలా జాగ్రత్త పడుతూ ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాడు. సీఎం క్యాబ్ (కామన్ మ్యాన్) పేరును ఆటో వెనుక రాసుకొని తిరుగుతూ చల్లని సేవలు అందిస్తున్నాడు.

News March 27, 2024

వరంగల్ మార్కెట్లో ఈరోజు ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం తేజ మిర్చి క్వింటాకి రూ.19,300 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి రూ.16వేలు, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,000 ధర వచ్చింది. మరోవైపు 5,531 మిర్చికి రూ.11,000 ధర, టమాటా మిర్చి 27వేలు, సింగల్ పట్టి రూ.45,000 ధర పలికాయి. కాగా నిన్నటితో పోలిస్తే ఈరోజు టమాటో, 5531 రకాల మిర్చిలు మినహా అన్ని రకాల మిర్చి ధరలు పెరిగాయి.

News March 27, 2024

నిర్మల్: అతిగా మద్యం తాగి పర్మిట్ రూంలోనే మృతి

image

అతిగా మద్యం తాగిన వ్యక్తి వైన్స్ పర్మిట్ రూంలోనే మృతి చెందిన ఘటన లోకేశ్వరంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలు.. లోకేశ్వరానికి చెందిన ప్రశాంత్ కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రశాంత్.. సాయంత్రం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న వైన్స్ పర్మిట్ రూంలో అతిగా మద్యం తాగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.