Telangana

News July 21, 2024

HYD: క్షయకు BCG టీకాతో చెక్

image

HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.

News July 21, 2024

HYD: క్షయకు BCG టీకాతో చెక్

image

HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.

News July 21, 2024

HYD: GREAT.. 12 మంది చిన్నారులను కాపాడారు

image

సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం 12 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించింది. ఇద్దరు హ్యూమన్ ట్రాఫికర్లు చిన్నారులను ఎత్తుకెళ్లడానికి యత్నించగా.. పక్కా సమాచారంతో రెస్క్యూ చేసి పిల్లలను రక్షించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News July 21, 2024

MBNR: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు

image

ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. తద్వారా జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 87,082 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 820 అడుగులకు చేరుకుంది.

News July 21, 2024

HYD: GREAT.. 12 మంది చిన్నారులను కాపాడారు

image

సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం 12 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించింది. ఇద్దరు హ్యూమన్ ట్రాఫికర్లు చిన్నారులను ఎత్తుకెళ్లడానికి యత్నించగా.. పక్కా సమాచారంతో రెస్క్యూ చేసి పిల్లలను రక్షించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News July 21, 2024

బంగారు బోనం.. కవిత దూరం!

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న నేపథ్యంలో మొదటిసారి BRS MLC కవిత సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేసేలా ఏటా కవిత బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాగా ఈ సారి లష్కర్ బోనాల వేడుకలకు కవిత రాలేని పరిస్థితి ఉండడంతో పలువురు BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 21, 2024

HYD: ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి..!

image

HYD నగరంలోని స్థానిక ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బ్యాంక్ సీడింగ్, డాక్యుమెంట్, అప్డేట్ ఆధార్, ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ వంటి సేవలు పొందడం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ముఖ్యమన్నారు. రూ.50 చెల్లించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని, వెబ్‌లింక్ bhuvan-app3.nrsc.gov.in/aadhaar ద్వారా ఆధార్ సెంటర్లను చూసుకోండి.

News July 21, 2024

NGKL: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చైతన్యపురి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKL జిల్లా అచ్చంపేట (M) చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శనివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

News July 21, 2024

HYD: ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి..!

image

HYD నగరంలోని స్థానిక ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని HYD ఆధార్ సెంటర్ అధికారులు చూపించారు. బ్యాంక్ సీడింగ్, డాక్యుమెంట్, అప్డేట్ ఆధార్, ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ వంటి సేవలు పొందడం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ముఖ్యమన్నారు. రూ.50 చెల్లించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని, వెబ్‌లింక్ bhuvan-app3.nrsc.gov.in/aadhaar ద్వారా ఆధార్ సెంటర్లను చూసుకోండి.

News July 21, 2024

బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన మంత్రి పొన్నం

image

సికింద్రాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ పూజారులు శాలువాతో సన్మానించి ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.