Telangana

News July 21, 2024

HYD: ప్రాణాలు కాపాడేందుకు నూతన టెక్నాలజీ!

image

గ్రేటర్ HYDలో వరదలు ముంచెత్తినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు DRF ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ వాడనున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ ఫైటింగ్ రోబోట్లు, సోనార్ స్కానర్, రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్, టెక్నాలజీ యూనిట్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో ఆపదలో ఉన్నవారిని కాపడటమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా సహకరిస్తుంది.

News July 21, 2024

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జులై 22 లోపు ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఫీజు చెల్లించాలని సూచించారు. మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లలో ఫీజు చెల్లించవచ్చన్నారు. PG రెండో సంవత్సర పరీక్షలు ఆగస్టు 20 నుంచి, PG మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

News July 21, 2024

HYD: ప్రాణాలు కాపాడేందుకు నూతన టెక్నాలజీ!

image

గ్రేటర్ HYDలో వరదలు ముంచెత్తినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు DRF ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ వాడనున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ ఫైటింగ్ రోబోట్లు, సోనార్ స్కానర్, రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్, టెక్నాలజీ యూనిట్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో ఆపదలో ఉన్నవారిని కాపడటమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా సహకరిస్తుంది.

News July 21, 2024

ఆదిలాబాద్: ఇన్స్పైర్ అవార్డులకు నామినేషన్స్

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇన్స్పైర్ అవార్డుల నామినేషన్ ప్రక్రియ కొరకు విద్యార్థులు నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు నామినేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ఐడియా కాంపిటీషన్ నిర్వహించాలని, ఐడియా బాక్సులు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎంపికైన ఆలోచనలకు రూ.10వేలు విద్యార్ధుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు.

News July 21, 2024

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగు

image

ఏటూరునాగారం మండలం దొడ్ల- మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపిలేని కుండపోత వర్షాలతో వాగుకు వరద పోటెత్తింది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగి 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

News July 21, 2024

మెదక్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తిన క్షణాలలో అక్కడకు చేరుకొనే విధంగా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని సిబ్బందన్నారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 57888, డయల్ 100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామన్నారు.

News July 21, 2024

MBNR: జూరాలలో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద ఉధృతి పెరగడంతో జూరాల వద్ద పర్యాటకులను అధికారులు హెచ్చరిస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 83వేల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

News July 21, 2024

HYD: ‘ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలు చేయాలి’

image

ఈనెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఫోరం రాష్ట్ర ఛైర్మన్ చీమ శ్రీనివాస్ బషీర్‌బాగ్‌లో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలన్నారు.

News July 21, 2024

HYD:‘ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలు చేయాలి’

image

ఈనెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఫోరం రాష్ట్ర ఛైర్మన్ చీమ శ్రీనివాస్ బషీర్‌బాగ్‌లో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలన్నారు.

News July 21, 2024

HYD: ఐటీ కంపెనీలకు ఆర్టీసీ అద్దె బస్సులు

image

HYD నగరంలోని కొండాపూర్, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నిత్యం సుమారు 20 వేల మంది ఉద్యోగులు కార్లలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య రోజుకు రోజుకు పెరుగుతోంది. ట్రాఫిక్ తగ్గించేందుకు పలు ఐటీ కంపెనీలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు ఆర్టీసీ సంస్థ నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని ఎండీ సజ్జనార్ హామీ ఇచ్చారు.