Telangana

News March 27, 2024

యాదాద్రి: దారుణం.. రెండున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి పక్కన నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులోని రసాయన పరిశ్రమలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఛైర్‌పర్సన్ డాక్టర్ రమాప్రభ తెలిపారు. ఆరు వారాల న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాక్టింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 27, 2024

బోథ్: ఐదేళ్లుగా కడుపులో.. అరుదైన ఆపరేషన్

image

బోథ్‌లోని ఓ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఉట్నూర్ మండలానికి చెందిన ఓ మహిళ గత 5ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ నిర్వహించి మూడు కిలోల కణితిని తొలిగించారు. డా. రవీంద్ర ప్రసాద్, శివ ప్రసాద్, సంతోష్ వైద్య బృందంతో ఆపరేషన్ నిర్వహించి మూడు కేజీల కణతిని తొలిగించినట్లు చెప్పారు. దీంతో వైద్యులు, సిబ్బందికి ఆమె కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

News March 27, 2024

MBNR: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో గెలుపు ఎవరిది..?

image

ఉమ్మడి MBNR స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డి ఇద్దరిలో గెలుపు ఎవరిది అనే చర్చ మొదలైంది. సంఖ్యా బలం ప్రకారం బీఆర్ఎస్ మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ అధికార పార్టీ ఆ ఓట్లకు గండి కొట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులలో కలవరం మొదలైంది. ఇరు పార్టీల చెందిన ఓటరు గోవా తదితర ప్రాంతాల్లో క్యాంపు ఏర్పాటు చేశారు.

News March 27, 2024

మల్కాజిగిరిపై అందరి గురి..!

image

మల్కాజిగిరి MP స్థానంపై BRS, కాంగ్రెస్, BJP స్పెషల్ ఫోకస్ పెట్టాయి. BJP ఈటలను బరిలోకి దించగా కాంగ్రెస్ సునీతారెడ్డిని పోటీలో నిలబెట్టింది. BRS వ్యూహాత్మకంగా లోకల్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది. ఇప్పటికే మల్కాజిగిరిలో PM మోదీ రోడ్ షో చేయగా KCR, రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ ప్రచారం చేస్తారని టాక్. 3 పార్టీలూ మల్కాజిగిరిలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై మీ కామెంట్?

News March 27, 2024

మల్కాజిగిరిపై అందరి గురి..!

image

మల్కాజిగిరి MP స్థానంపై BRS, కాంగ్రెస్, BJP స్పెషల్ ఫోకస్ పెట్టాయి. BJP ఈటలను బరిలోకి దించగా కాంగ్రెస్ సునీతారెడ్డిని పోటీలో నిలబెట్టింది. BRS వ్యూహాత్మకంగా లోకల్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది. ఇప్పటికే మల్కాజిగిరిలో PM మోదీ రోడ్ షో చేయగా KCR, రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ ప్రచారం చేస్తారని టాక్. 3 పార్టీలూ మల్కాజిగిరిలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై మీ కామెంట్?

News March 27, 2024

MBNR: రేపు ఎస్సీ స్టడీ సర్కిల్లో స్పాట్ అడ్మిషన్లు

image

SC స్టడీ సర్కిల్లో మూడు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులకు 28న తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి వి.పాండు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఉచిత శిక్షణకు ఇప్పటికే 56 మంది ఎంపిక కాగా.. ఇంకా 44 సీట్లు ఖాళీలు ఉన్నాయని, వీటి భర్తీకి రేపే స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 27, 2024

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర ఇలా..

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.6,920గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,250గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు ధర రూ.30 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.

News March 27, 2024

MDK: విషాదం.. రైతు మృతి

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కొత్త కాపు నరేందర్ రెడ్డి(53) చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. నిన్న సాయంత్రం చింతకాయలు తెంపేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందగా.. కుటుంబీకులు రాత్రి గుర్తించారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

సికింద్రాబాద్: ప్రత్యేక రైళ్ల పొడిగింపు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ఏర్పాటు చేసిన 20 ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వరకు పొడిగించినట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-అగర్తల, సికింద్రాబాద్ డిబ్రూగర్, తిరుపతి-సంత్రాగచ్చి, హైదరాబాద్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్-రెక్సాల్, HYD-రెక్సాల్, సికింద్రాబాద్-దానాపూర్, HYD-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు జూన్ నెలాఖరు వరకు రాకపోకలు సాగించనున్నాయి.