Telangana

News March 27, 2024

సికింద్రాబాద్: ప్రత్యేక రైళ్ల పొడిగింపు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ఏర్పాటు చేసిన 20 ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వరకు పొడిగించినట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-అగర్తల, సికింద్రాబాద్ డిబ్రూగర్, తిరుపతి-సంత్రాగచ్చి, హైదరాబాద్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్-రెక్సాల్, HYD-రెక్సాల్, సికింద్రాబాద్-దానాపూర్, HYD-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు జూన్ నెలాఖరు వరకు రాకపోకలు సాగించనున్నాయి.

News March 27, 2024

గోదావరిఖని: స్నేహితుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

image

గోదావరిఖని మార్కండేయ కాలనీలో వ్యక్తిగత విషయాలతో జరిగిన గొడవలో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి వీరి మధ్య గొడవ జరగడంతో ఒకరినొకరు తిట్టుకుని వినీత్ కత్తితో కరణ్ పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన కరణ్ ను చికిత్స కోసం HYDఆస్పత్రికి తరలించారు. బాధితుడి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినీత్, అతని సోదరుడు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

News March 27, 2024

నల్గొండ ఎంపీ అభ్యర్థి మార్పు తప్పదా?

image

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని మార్చేందుకు ఆ పార్టీ అధిష్టానం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సైదిరెడ్డిని మార్చాలని ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చినట్లు సమాచారం. 

News March 27, 2024

మద్నూర్: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు చోరీ

image

ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మద్నూరులో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. మద్నూరుకు చెందిన మహజన్ బాలాజీ ఈనెల 26న సాయంత్రం ఇంటికి తాళం వేసి మార్కెట్‌లో సరుకులు కొనుగోలు కోసం వెళ్లాడు. తిరిగి రాత్రి 8:45 ప్రాంతంలో ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని 25 తులాల బంగారం, రూ.16వేలు ఎత్తుకెళ్లారని బాలాజీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI శ్రీకాంత్ తెలిపారు.

News March 27, 2024

గ్రేటర్ HYDలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5 డిగ్రీలు నమోదైనట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అలాగే గాలిలో తేమ 30 శాతంగా ఉందన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగుతో వెళ్లాలని సూచిస్తున్నారు.

News March 27, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,900 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News March 27, 2024

గ్రేటర్ HYDలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5 డిగ్రీలు నమోదైనట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అలాగే గాలిలో తేమ 30 శాతంగా ఉందన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగుతో వెళ్లాలని సూచిస్తున్నారు.

News March 27, 2024

వేములవాడ రాజన్నకు రూ.2.21 కోట్ల ఆదాయం

image

వేములవాడ రాజన్నకు 21 రోజుల్లో రూ 221 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లెక్కించారు. 21 రోజుల్లో ఈ ఆదాయం సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. అలాగే 463 గ్రాముల బంగారం 19.800 కిలోల వెండి సమకూరినట్లు వివరించారు.

News March 27, 2024

HYD: ఈనెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

image

హైదరాబాద్‌ జిల్లాలో 2024లో గ్రూప్‌–1 సర్వీసెస్‌ పరీక్ష రాసే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ దరఖాస్తులు స్వీకరణ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మహమ్మద్‌ ఇలియాస్‌ అహ్మద్‌ మంగళవారం తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నాంపల్లి హజ్‌హౌస్‌ భవనంలోని 6వ అంతస్తులోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

News March 27, 2024

బెల్లంపల్లి: రైలు ఢీకొని యువకుడి మృతి

image

బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మహారాష్ట్రకు చెందిన యువకుడు రమేష్ చిన్న నరోటి(24) మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన రమేష్.. నరోటి ఆహారశుద్ధి పరిశ్రమ పనుల్లో కూలీగా పనిచేస్తున్నట్లు చెప్పారు.