India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రకాశం గంజి వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో తొలి పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. విగ్నేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించాలని గణేష్ ని ఆశీస్సులతో ప్రజా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు కలెక్టర్ పమెలా సత్పతి కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
HYD బాలాపూర్ గణపతిని కళాకారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తలపై భాగంలో అమృతం కోసం సముద్ర మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహ చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని నివేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని, మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కి.మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50 వేల చెట్లు కూలాయన్నారు. క్లౌడ్ బరస్ట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు తెలిపామని అన్నారు.
HYD బాలాపూర్ గణపతిని కళాకారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తలపై భాగంలో అమృతం కోసం సముద్ర మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహ చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో మున్నూరు కాపు సంఘం యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎలుకలు లంబోదరుడిని ఎగరేసి పట్టుకున్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 11 రోజులు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేస్తామని యూత్ సభ్యులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ రామ మందిరంలో వినాయక చవితి సందర్భంగా తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్ రాజ్ విగ్నేశ్వరుడికి శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరి విజ్ఞాలు తొలగి వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, ప్రదీప్, రమాకాంత్ పాల్గొన్నారు.
✔శ్రీశైలం డ్యామ్..8 గేట్ల ఎత్తివేత
✔NGKL:బొలెరో వాహనం ఢీకొని చిన్నారి మృతి
✔దౌల్తాబాద్:అప్పుడే పుట్టిన శిశువుని పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
✔పలుచోట్ల వర్షం.. సజావుగా రాకపోకలు
✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
✔NRPT:10న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
✔పలుచోట్ల మట్టి విగ్రహాలు పంపిణీ
✔ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి:SIలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నీటిని వదిలారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులు ఇక్కడికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సెల్ఫీ, ఫోటోలు తీసుకునే క్రమంలో ప్రమాదాన్ని గ్రహించడం లేదు. ఏదైనా నష్టం జరిగితే ఊహించని నష్టం వాటిల్లుతుంది. ఎలాంటి ప్రమాదం జరగక ముందే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
☛VMWD: మండపాన్ని సిద్ధం చేస్తున్న కూలీలకు విద్యుత్ షాక్.. ఇద్దరికీ గాయాలు ☛PDPL: ఎల్లమ్మ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య ☛SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు అరెస్టు ☛HZB: వినాయక మండపంలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి ☛HZB: భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్ ☛కోరుట్ల: విద్యుత్ షాక్ తో మహారాష్ట్ర కూలి మృతి ☛GDK: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లికి చెందిన జంపయ్య శనివారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినాయక చవితి పండుగ పూట ఎల్లమ్మ చెరువులో జంపయ్య దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో, ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జంపయ్య మృతికి గల కారణాలు తెలియ రాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.