Telangana

News March 27, 2024

HYD: భిక్షాటన చేస్తున్న వారిని తరలించిన అధికారులు

image

భిక్షాటనతో చిన్నారుల జీవితాలను నాశనం చేయొద్దని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. నగరంలో భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, వారి తల్లులను ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా గుర్తించారు. HYD కాచిగూడ నింబోలి అడ్డలోని జువైనల్‌ బాలికల హోం నుంచి వారి ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. 19 మంది చిన్నారులు, ఆరుగురు తల్లులను వారి గ్రామాలకు తరలించామన్నారు.

News March 27, 2024

MDK: KCRకు ఇచ్చే GIFT అదే: MLA

image

మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి BRS అధినేత KCRకు అసలైన గిఫ్ట్ ఇద్దామని ఆ పార్టీ శ్రేణులకు సంగారెడ్డి MLA చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినంత మాత్రాన శ్రేణులు నిరాశ చెందొద్దని, ఈసారి గెలుద్దామన్నారు.

News March 27, 2024

HYD: భిక్షాటన చేస్తున్న వారిని తరలించిన అధికారులు 

image

భిక్షాటనతో చిన్నారుల జీవితాలను నాశనం చేయొద్దని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. నగరంలో భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, వారి తల్లులను ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా గుర్తించారు. HYD కాచిగూడ నింబోలి అడ్డలోని జువైనల్‌ బాలికల హోం నుంచి వారి ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. 19 మంది చిన్నారులు, ఆరుగురు తల్లులను వారి గ్రామాలకు తరలించామన్నారు. 

News March 27, 2024

HYD: బైక్ ఓవర్ టేక్.. యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మేడ్చల్‌ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దుండిగల్‌ నుంచి బైక్‌పై మేడ్చల్‌ వైపు వస్తున్న ఓంప్రకాశ్(23) స్థానిక అయోధ్య చౌరస్తా వద్ద లారీని ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నాడు. దీంతో ఓంప్రకాశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవర్ టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.

News March 27, 2024

HYD: బైక్ ఓవర్ టేక్.. యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మేడ్చల్‌ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దుండిగల్‌ నుంచి బైక్‌పై మేడ్చల్‌ వైపు వస్తున్న ఓంప్రకాశ్(23) స్థానిక అయోధ్య చౌరస్తా వద్ద లారీని ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నాడు. దీంతో ఓంప్రకాశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవర్ టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.

News March 27, 2024

809 పోలింగ్ కేంద్రాలు.. 4,338 మంది సిబ్బంది

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 809 పోలింగ్ కేంద్రాల్లో మొదటి దశ ర్యాండమైజేషన్ ద్వారా 1,338 మంది సిబ్బందిని కేటాయించినట్లు వరంగల్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో ఎన్ఐసీ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ, ఆన్లైన్లో పోలింగ్ సిబ్బంది మొదటి దశ యాదృచ్ఛికీకరణ ప్రక్రియ నిర్వహించారు.

News March 27, 2024

నిర్మల్: పాముకాటుతో యువరైతు మృతి

image

నాటువైద్యం వికటించి రైతు మృతి చెందిన ఘటన దస్తురాబాద్‌ మండలంలో జరిగింది. SI యాసిర్‌ ఆరాఫత్‌ వివరాలు.. గొడిసిర్యాల గొండుగూడకు చెందిన మెస్త్రం భుజంగరావ్‌(23)కు ఈనెల 18న పాముకాటు గురయ్యారు. ఓ నాటు వైద్యుడికి రూ.10వేలు ఇచ్చి వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 25న నిర్మల్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News March 27, 2024

MBNR:రేపు ఉచితంగా గుండె వైద్య శిబిరం

image

జిల్లా వైద్యారోగ్యశాఖ-ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రి సహకారంతో ఈనెల 28న చిన్నపిల్లలకు ఉచితంగా గుండె సంబంధ వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఈ మేరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డీఈఐసీ మేనేజర్ దేవిదాస్ తెలిపారు. 0-18ఏళ్ల వారి కోసం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News March 27, 2024

ఇల్లంతకుంటలో గుండెపోటుతో విద్యార్థి మృతి !

image

సిరిసిల్ల: గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగింది. గ్రామానికి చెందిన ఎల్లంకి సాయితేజ(14) 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె వ్యాధితో సాయి బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

News March 27, 2024

నిజామాబాద్ జిల్లాలో కుష్ఠి వ్యాధి విస్తరిస్తోంది..!

image

ఉమ్మడి జిల్లాలో కుష్ఠి వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. NZBజిల్లాలో గతేడాది సెప్టెంబరులో చేపట్టిన సర్వేలో 214 మంది అనుమానితులను గుర్తించి 15 మందిలో వ్యాధిని గుర్తించారు. తాజాగా జరిగిన సర్వేలో 462 మందిని అనుమానితులను గుర్తించగా వీరికి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంది. 6నెలల్లోనే అనుమానితుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా వ్యాధిని నివారణకు జిల్లా వైద్యాశాఖ చర్యలు చేపట్టింది.