Telangana

News July 21, 2024

తాలుపేరు ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తివేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని ఉన్న తాలి పేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రాజెక్టుకు ఉన్న 25 గేట్లు మొత్తం ఎత్తి 55,232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 52,897 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం నుంచి వరదనీరు భారీగా వస్తున్నట్లు వెల్లడించారు.

News July 21, 2024

HYD: వరద నివారణ చర్యల్లో యంత్రాంగం

image

అధికార యంత్రాంగమంతా వరద నివారణ చర్యల్లో ఉందని, 24 గంటలు అత్యవసర బృందాలు పని చేస్తున్నాయని GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య, రోడ్లపై నీరు నిలవడం, చెట్లు కూలడం తదితర ఇబ్బందులపై ఆమె అధికారులతో మాట్లాడారు. జోనల్ సర్కిల్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. తరచుగా నీరు నిలిచే ప్రాంతాల్లో 238 స్టాటిక్ బృందాలు రోజంతా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు.

News July 21, 2024

HYD: వరద నివారణ చర్యల్లో యంత్రాంగం

image

అధికార యంత్రాంగమంతా వరద నివారణ చర్యల్లో ఉందని, 24 గంటలు అత్యవసర బృందాలు పని చేస్తున్నాయని GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య, రోడ్లపై నీరు నిలవడం, చెట్లు కూలడం తదితర ఇబ్బందులపై ఆమె అధికారులతో మాట్లాడారు. జోనల్ సర్కిల్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. తరచుగా నీరు నిలిచే ప్రాంతాల్లో 238 స్టాటిక్ బృందాలు రోజంతా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు.

News July 21, 2024

HYD: రూ.5కే టిఫిన్..!

image

గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.

News July 21, 2024

37 అడుగులకు చేరిన గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు 37 అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలియజేశారు. ఎగువనుంచి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో గోదావరిలోని వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో క్రమేపీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

News July 21, 2024

HYD: రూ.5కే టిఫిన్..!

image

గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.

News July 21, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్ సాగర్

image

నగరంలో కురుస్తోన్న ఎడతెరిపిలేని వానతో హుస్సేన్ సాగర్‌కు అన్ని వైపుల నుంచి శనివారం వరద పెరిగింది. 1,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, మత్తడి నుంచి 998 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నట్లు GHMC తెలిపింది. భారీగా దిగువకు దూకుతున్న నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 514.75 మీ కాగా, సాయంత్రం 6 గంటల సమయానికి 513.23 మీ నీటిమట్టం నమోదైందని అధికారులు తెలిపారు.

News July 21, 2024

MBNR: ఆపిల్ ఫోన్‌ కోసం హత్యాయత్నం

image

ఆపిల్ ఫోన్ దక్కించుకునేందుకు ఓవ్యక్తి ఏకంగా హత్య చేయబోయిన ఘటన MBNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. వీరన్నపేటకు చెందిన సయ్యద్‌మస్తాన్, టీడీగుట్ట ఫైర్‌స్టేషన్‌కు చెందిన అక్తర్ ఫ్రెండ్స్. ఈనెల 12న అక్తర్ ఫోన్‌ను ముస్తాన్ తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఫోన్ తీసుకునేందుకు ముస్తాన్ ఇంటికెళ్లగా కత్తితో పొడిచాడు. అక్తర్‌ను ముళ్లపొదల్లో వేయడానికి బైక్‌పై తీసుకెళ్లి భయంతో క్లాక్ టవర్ వద్ద వదిలి పరారయ్యాడు.

News July 21, 2024

సంగారెడ్డి: రేపు ప్రజావాణి కార్యక్రమం

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో 22వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 21, 2024

మెదక్: గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,703 మంది మల్టీపర్పస్ ఉద్యోగుల వేతనాల కోసం రూ. 24.89 కోట్ల నిధులు విడుదలయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు రూ. 11,75,72,000, సంగారెడ్డి జిల్లాకు రూ. 8,09,97,000, మెదక్ జిల్లాకు రూ. 5,03,97,500 విడుదలయ్యాయి.