India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం: రానున్న లోకసభ ఎన్నికల నిర్వహణకై పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1459 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పీవో, ఏపీవో, ఎంవోల జాబితా సిద్ధం చేయాలన్నారు. వాస్తవ సిబ్బంది ఆవశ్యకతతో పాటు, రిజర్వ్ సిబ్బంది జాబితాలో ఉండాలని అధికారులను సూచించారు.
గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్, RRB, SSC రాష్ట్ర స్థాయి& కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి L. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 28న NLGలో గల విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్ లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్రూప్స్ పరీక్షల ఉచిత శిక్షణకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కన్యాకుమారి అన్నారు. మంగళవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. గ్రూప్స్ 1,2,3,4 అభ్యర్థులు ఈనెల 28 లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహణ బాధ్యతలను మహిళా కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘అమ్మ ఆదర్శ’ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయనుంది. శానిటేషన్ నుంచి విద్యార్థులకు అందించే ఉచిత దుస్తుల పంపిణీ, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణాలు, మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలను ఇలా సమస్తం మహిళా కమిటీల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ జహీరాబాద్ MP బిబి పాటిల్ పై విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బాన్సువాడ శివారులో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్ళు అధికారంలో ఉండి ఏం పని చేశావు అని బిబి పాటిల్ ను ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చోని స్వంత ఫైరవీలు, వ్యాపారులు చేసుకోవడం తప్ప ఈ ప్రాంత ప్రజలకు అయన ఏ మేలు చేయలేదని ఆరోపించారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహణ బాధ్యతలను మహిళా కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘అమ్మ ఆదర్శ’ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయనుంది. శానిటేషన్ నుంచి విద్యార్థులకు అందించే ఉచిత దుస్తుల పంపిణీ, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణాలు, మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలను ఇలా సమస్తం మహిళా కమిటీల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్ RTC X రోడ్స్లో చిక్కడపల్లి పోలీసులు మంగళవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. IPL టికెట్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు రైడ్స్ చేశారు. విజయ్, ప్రణయ్, సాత్విక్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. రేపటి SRH VS MI మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ RTC X రోడ్స్లో చిక్కడపల్లి పోలీసులు మంగళవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. IPL టికెట్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు రైడ్స్ చేశారు. విజయ్, ప్రణయ్, సాత్విక్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. రేపటి SRH VS MI మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 68 వేల నగదు సీజ్ . @ ధర్మారం మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు. @ వేములవాడలో కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారు. @ లైసెన్సుడ్ గన్ లను సరెండర్ చేయాలన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ వివాహితను ట్రాప్ చేసిన ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ ఎస్పీ ఆఫీస్ కు అటాచ్.
విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు చూస్తే… మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన సిద్ధం పుల్లయ్య (82) అనే వృద్ధుడు తన ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ షాక్ తగిలి పుల్లయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు.
Sorry, no posts matched your criteria.