Telangana

News July 21, 2024

150 మంది సబ్జెక్టు టీచర్ల సర్దుబాటు: డీఈవో

image

ఖమ్మం జిల్లాలో వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు అధికంగా ఉన్న పాఠశాలల నుంచి సర్దుబాటు చేశారు. ఈ మేరకు 150 మంది ఉపాధ్యాయులను గుర్తించగా శనివారం జాబితాను ఉన్నతాధికారులకు పంపించినట్లు డీఈఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం రాగానే వారిని అవసరమైన పాఠశాలలకు కేటాయించనుండగా సబ్జెక్టు టీచర్ల కొరత తీరుతుందని వెల్లడించారు.

News July 21, 2024

MBNR: DSC పరీక్షకు 405 మంది హాజరు

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్న ఆన్ లైన్ డీఎస్సీ పరీక్షలకు శనివారం 475 మందికి గాను 405 మంది హాజరైనట్లు డీఈఓ రవీందర్ తెలిపారు. ఉదయం మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.

News July 21, 2024

నిత్యం నెత్తురోడుతున్న రహదారులు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకి రోడ్డు ప్రమాద ఘటనలు భయంకరంగా పెరుగుతున్నాయి. నిత్యం రోడ్డుప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు అజాగ్రత్త, అతివేగం, మద్యపానం చేసి వాహనాలు నడపడమేనని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు.

News July 21, 2024

వర్షాకాలంలో విద్యుత్ తీగలతో జాగ్రత్త!

image

భారీ వర్షాల వల్ల ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా తడిసిన మోటార్లతో రైతులు జాగ్రత్త వహించాలని చెప్పారు. ప్రజలు ఇంటి సర్వీస్ వైర్లని కాని, వాటితో వేలాడే ఇనుప తీగలను కానీ బట్టలు ఆరేసుకునే తీగలకు దగ్గరలో విద్యుత్ వైర్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులకు తెలపాలని కోరారు.

News July 21, 2024

ఖమ్మం జిల్లాలో బెల్ట్ షాపుల దందా!

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుందని జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. గ్రామస్థాయిలో ప్రతి చిన్న కిరాణా షాపులలో మద్యం పుష్కలంగా అందుబాటులో ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా ఈ దందా రెచ్చిపోతుందని వాపోతున్నారు. అబ్కారీ శాఖ వైఖరి కారణంగా మద్యం మాఫియా దూకుడు మీద ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్యం మాఫియాని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News July 21, 2024

మెదక్: నవోదయ నోటిఫికేషన్ విడుదల

image

నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైందిన సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్‌ నవోదయ ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని విద్యార్థులు సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News July 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు పలు చోట్ల వర్షాలు> వరద నీటి ప్రభావంతో ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి> లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు> నేడు పెద్ద వాగును పరిశీలించనున్న మంత్రి తుమ్మల> ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో నేడు వైద్య శిబిరం> భద్రాచలం రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు> ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు> పలు మండలాల్లో రుణమాఫీ సంబరాలు

News July 21, 2024

కరీంనగర్: భారీ వర్షం.. ఈ నంబర్‌కి కాల్ చేయండి

image

భారీ వర్షం కారణంగా కరీంనగర్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బల్దియా అత్యవసర చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వరద నీరు నిలవకుండా రెస్క్యూ టీం సభ్యులు పనిచేస్తారు. భారీ గుంతలు ఏర్పడితే తాత్కాలికంగా మట్టితో పూడ్చివేస్తారు. అత్యవసర సేవలకైన 98499 06694 నంబర్ కాల్ చేయలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్, నగర్ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు.

News July 21, 2024

ఫోన్ చేసి ఆధార్ నంబర్ చెప్పాలి: DAO శ్రవణ్‌కుమార్‌

image

పంట రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి నల్గొండ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసినట్లు DAO శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. కాల్‌ సెంటర్‌ నంబర్‌ 7288800023కి ఫోన్‌ చేయడం ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఫోన్‌ చేసేటప్పుడు ఆధార్‌ నంబర్‌ తెలపాలన్నారు. మండల స్ధాయిలో ఏవోకు ఫోన్‌ ద్వారా, స్వయంగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందాలన్నారు.

News July 21, 2024

నిజామాబాద్: బాలుడి కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరి

image

GGHలో శనివారం మూడేళ్ల బాలుడు<<13667747>> కిడ్నాప్<<>> అయిన విషయం తెలిసిందే. ఆ కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 6 బృందాలుగా విడిపోయి గాలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఆర్మూర్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించి మెట్‌పల్లి వద్ద సా.4గంటలకు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన చెల్లికి పిల్లలు లేకపోవడంతో తన స్నేహితుడితో కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.