India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
షాంపూ కోసం కన్నతల్లిని ఇటుకతో కొట్టి హత్య చేసిన సంఘటన మెదక్ మండలం రాజ్పల్లిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవమ్మ(58)తో తన కుమరుడు నారాయణ షాంపూ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో తల్లిని ఇటుకతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ త్వరలో నల్గొండకు రానున్నారు. నీళ్లు లేక ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పంటలను పరిశీలించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంబంధిత నివేదికను KCRకు అందించారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోవాకు తరలిన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఈరోజు తిరుగు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. వారికి హైదరాబాదుకు తరలిస్తారని సమాచారం. మార్చి 28న ఓటింగ్ సమయానికి వనపర్తికు తెచ్చే అవకాశం ఉంది. ఓటర్లను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసిన సంగతి విధితమే.
సికింద్రాబాద్లో గెలవబోతున్నామని BRS MP అభ్యర్థి పద్మారావు జోస్యం చెప్పారు. తెలంగాణభవన్లో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అప్పట్లో నా వద్ద బండి లేదు. కార్పొరేటర్ నుంచి పార్లమెంట్ స్థాయికి ఎదిగాను. నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. నా బాస్ KCR ఒక్కరే. ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ MP ఎన్నికల్లోనూ గెలుస్తాను’ అంటూ పద్మారావు ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్లో గెలవబోతున్నామని BRS MP అభ్యర్థి పద్మారావు జోస్యం చెప్పారు. తెలంగాణభవన్లో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అప్పట్లో నా వద్ద బండి లేదు. కార్పొరేటర్ నుంచి పార్లమెంట్ స్థాయికి ఎదిగాను. నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. నా బాస్ KCR ఒక్కరే. ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ MP ఎన్నికల్లోనూ గెలుస్తాను’ అంటూ పద్మారావు ధీమా వ్యక్తం చేశారు.
అశ్వరావుపేట మండలం నందమూరి కాలనీలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ నెలకొంది. రంజాన్, చిన్నా అనే ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చెలరేగి రంజాన్ గొడ్డలి తీసుకువచ్చి చిన్నాపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న స్థానికులు గాయపడ్డారు. చిన్నాను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వ్యక్తులకు NZB ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ సయ్యద్ ఖదీర్ జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. NZB పట్టణ పరిధిలో ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 12 మంది పట్టుబడ్డారు. వారిని మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 10 మందికి రూ. 11300 జరిమానాలు మరో ఇద్దరికి 2 రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ ACP నారాయణ తెలిపారు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లైసెన్సు తుపాకులు కలిగిన వారు వెంటనే ఆయా స్టేషన్లలో సరెండర్ చేయాలని CPశ్రీనివాస్ (IPS) ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 7న తిరిగి తీసుకోవచ్చున్నారు . జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందన్నారు. నిబంధనలు పాటించాలన్నారు.
మునగాల మండలం ఆకుపాముల శివారులో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వెంకట నర్సయ్య అతని తల్లి రాంబాయమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు మేళ్లచెరువుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో సోమవారం హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన <<12927777>>ఘర్షణ<<>> ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ప్రకాష్ అనే యువకుడు హోలీ ఆడుతుండగా పక్కింటి పైకి గుడ్డు విసిరాడు. దీంతో పక్కింటి రిషి, ఆయన తల్లి రమ అడగడంతో ప్రకాష్ కొడవలితో దాడిచేయగా రమకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.