Telangana

News March 26, 2024

HYD: అనంతగిరి, బల్కంపేట్ టెంపుల్‌పై ఫోకస్..!

image

స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.38 కోట్ల వ్యయం (ప్యాకేజ్-1)తో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాంతంగా మార్చే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. మరోవైపు ‘ప్రసాద్’ పథకం కింద రూ.4.05 కోట్ల వ్యయంతో HYD బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి, పక్కనే ఉన్న పాత భవనాన్ని కూల్చి 3 అంతస్తుల కొత్త భవనం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

HYD: అనంతగిరి, బల్కంపేట్ టెంపుల్‌పై ఫోకస్..!

image

స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.38 కోట్ల వ్యయం (ప్యాకేజ్-1)తో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాంతంగా మార్చే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. మరోవైపు ‘ప్రసాద్’ పథకం కింద రూ.4.05 కోట్ల వ్యయంతో HYD బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి, పక్కనే ఉన్న పాత భవనాన్ని కూల్చి 3 అంతస్తుల కొత్త భవనం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

వివాహితను ట్రాప్ చేసిన ASI..!  ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్‌

image

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ASI రామయ్యను SP ఆఫీసుకు అటాచ్‌ చేస్తూ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భర్త వేధిస్తున్నాడని న్యాయం చేయాలని వెళ్లిన వివాహితను కాపాడాల్సిన పోలీసే ట్రాప్‌ చేశాడని మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.

News March 26, 2024

జవహర్‌నగర్‌లో మరో ప్లాంట్ నిర్మాణం..!

image

గ్రేటర్ HYDలో వెలువడుతున్న చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇక్కడి ప్లాంట్ ద్వారా నిత్యం 24 మెగావాట్ల కరెంట్‌ను చెత్త నుంచి తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి 2,500మెట్రిక్ టన్నుల చెత్తను ఉపయోగిస్తున్నామని, GHMC వ్యాప్తంగా దాదాపు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుందని, జవహర్‌నగర్‌లోనే 24 మెగావాట్ల సామర్థ్యంతో మరొక ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు.

News March 26, 2024

జవహర్‌నగర్‌లో మరో ప్లాంట్ నిర్మాణం..!

image

గ్రేటర్ HYDలో వెలువడుతున్న చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇక్కడి ప్లాంట్ ద్వారా నిత్యం 24 మెగావాట్ల కరెంట్‌ను చెత్త నుంచి తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి 2,500మెట్రిక్ టన్నుల చెత్తను ఉపయోగిస్తున్నామని, GHMC వ్యాప్తంగా దాదాపు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుందని, జవహర్‌నగర్‌లోనే 24 మెగావాట్ల సామర్థ్యంతో మరొక ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు. 

News March 26, 2024

MBNR: పాలమూరులో భానుడి భగభగలు.!

image

ఉమ్మడి పాలమూరులో వేసవి పూర్తిస్థాయిలో మొదలవకముందే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం తొమ్మిది దాటితే చాలు ఎండ వేడిమిని ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. ప్రస్తుతం మార్చి నెలలోనే పలు ప్రాంతాల్లో 33 డిగ్రీల నుంచి 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావడానికి భయపడుతున్నారు.

News March 26, 2024

సంగారెడ్డిలో తీవ్ర విషాదం.. ఇద్దరు యువకుల మృతి

image

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్న చెరువులో పడి ఇద్దరి యువకులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హోలీ సంబరాల్లో భాగంగా సూరారం గ్రామానికి చెందిన శ్రావణ్ (17), శంకర్ (22) తమ మిత్రులతో కలిసి వీరన్నగూడెం చెరువులో స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

News March 26, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా…

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,200 ధర, 341 రకం మిర్చి రూ.15,500, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,000 ధర వచ్చింది. అలాగే 5,531 మిర్చికి రూ.12,000 ధర, టమాటా మిర్చి 30వెలు, సింగల్ పట్టి రూ.41,500 ధర పలికాయి. అలాగే మక్కలు బిల్టీ క్వింటాకు రూ.2200 పలికాయి.

News March 26, 2024

సంగారెడ్డి: ఫేస్‌బుక్ పరిచయం.. రూ.8.57 లక్షలు కొట్టేసింది..!

image

సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు పరిధి  బీరంగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి HYD వస్తున్నానని నమ్మించి పలు దఫాలుగా రూ.8.57 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. అనంతరం రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

News March 26, 2024

ఖమ్మంలో ఎలా ముందుకెళ్లాలి..?

image

ఖమ్మం జిల్లాలో పొత్తు కోసం సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచి చూస్తున్నాయి. బీఆర్ఎస్ తో వెళ్లేది లేదని చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగైదు స్థానాల్లో పోటీకి సిద్దమైన సీపీఐ కొత్తగూడెం స్థానానికే పరిమితమైంది. సీపీఐ కోరుతున్న స్థానాల్లో ఖమ్మం పార్లమెంట్ కూడా ఉంది. నాలుగైదు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.