Telangana

News March 26, 2024

మాజీ సీఎం KCRను కలిసిన నల్గొండ MP అభ్యర్థి  

image

మాజీ సీఎం KCRను కలిసిన నల్గొండ MP అభ్యర్థి  కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కలిశారు. ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను కలుపుకుని లోక్ సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కేసీఆర్ వారికి సూచించారు. ప్రజలతో మమేకమైతే తప్పకుండా విజయం సాధ్యమవుతుందని చెప్పారు. 

News March 26, 2024

HYD: ఫేస్‌బుక్ పరిచయం.. రూ.8.57 లక్షలు కొట్టేసింది..!

image

HYDలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు పరిధి బీరంగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి HYD వస్తున్నానని నమ్మించి పలు దఫాలుగా రూ.8.57 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. అనంతరం రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 26, 2024

HYD: ఫేస్‌బుక్ పరిచయం.. రూ.8.57 లక్షలు కొట్టేసింది..!

image

HYDలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు పరిధి బీరంగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి HYD వస్తున్నానని నమ్మించి పలు దఫాలుగా రూ.8.57 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. అనంతరం రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 26, 2024

జగిత్యాల: రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టిన హోలీ వేడుకలు

image

హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడిని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

News March 26, 2024

కొమురవెల్లి మల్లన్న పదో వారం ఆదాయం రూ.43.76 లక్షలు

image

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పదో వారం పురస్కరించుకుని రూ.43.76 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ ప్రకటించారు. అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనం, ప్రసాదాల విక్రయాల ద్వారా శనివారం రూ.4,77,648, ఆదివారం రూ.34,98,777, సోమవారం రూ.4,00,020 ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు.

News March 26, 2024

MBNR:గడువు పొడగింపు..దరఖాస్తుల ఆహ్వానం!

image

సాంఘిక,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను 6-9 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారని ఎస్సీ గురుకుల విద్యాలయాల మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు.ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తామని, అర్హులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News March 26, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7170

image

మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్‌కు భారీగా పత్తి తరలివచ్చింది. అయితే గత వారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గత వారం క్వింటా పత్తి రూ.7300 కి పైగా పలకగా.. ఈరోజు రూ.7170కి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. 

News March 26, 2024

జగిత్యాల: రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టిన హోలీ వేడుకలు

image

హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడుని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

News March 26, 2024

HYD: లైంగికంగా వేధిస్తున్నాడని కత్తితో పొడిచాడు..!

image

లైంగిక వేధింపులు తాళలేక ఓ యువకుడు ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన HYD ఘట్‌కేసర్ పరిధిలో జరిగింది. CI తెలిపిన వివరాలు.. జనగామ వాసి భీమానాయక్‌తో బిహార్ వాసి మితేశ్‌కు పరిచయం ఏర్పడింది. పని ఇప్పిస్తానని, తన దగ్గరకు రావాలని భీమానాయక్ మితేశ్‌ను లైంగికంగా వేధిస్తున్నాడు. కోపం పెంచుకున్న మితేశ్ అతడిని కొండాపూర్‌కు పిలిచి, మద్యం తాగిన అనంతరం కత్తితో దాడి చేశాడు. మితేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News March 26, 2024

MDK: ఒంటరిగా వెళ్లేవారే వీరి TARGET.. జర జాగ్రత్త!

image

ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు.. పటాన్‌చెరులో ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతోంది. సోమవారం ఇంద్రేశం వద్ద ORR సర్వీస్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పారిపోతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.