Telangana

News July 20, 2024

కొత్తగూడెం: ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉ.11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులకు వీలుగా “గ్రీవెన్స్ డే”ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి నేరుగా తెలపడానికి అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News July 20, 2024

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన నేపథ్యంలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3434, 9154252936 లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.

News July 20, 2024

మెండోరా: ‘నా భర్త మృతదేహాన్ని తెప్పించండి సారూ’

image

నిజామాబాద్ జిల్లా మెండోరాకు చెందిన మాకురి వినోద్ బతుకుదెరువుకోసం బెహరన్ దేశం వెళ్లాడు. కాగా ఈనెల17న డ్యూటీలో ఉండగానే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వినోద్ మృతదేహన్ని త్వరగా స్వదేశానికి తీసుకు వచ్చేలా చూడాలని అతని భార్య యమున, పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

News July 20, 2024

ఉపాధ్యాయుడిగా మారిన సిరిసిల్ల కలెక్టర్

image

సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఈ సందర్భంగా విద్యార్థులకు బోధన చేసి పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలోని పలు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News July 20, 2024

BREAKING: HYD: సనత్‌నగర్ సీఐపై సీపీ చర్యలు

image

HYD సనత్‌నగర్ సీఐ పురేందర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీ చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనతో సీఐ అసభ్యకరంగా చాటింగ్ చేశాడని బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలంటూ చాటింగ్ చేశాడని పేర్కొంది. మెసేజ్‌లను చూయించింది. దీంతో సీఐను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

BREAKING: HYD: సనత్‌నగర్ సీఐపై సీపీ చర్యలు 

image

HYD సనత్‌నగర్ సీఐ పురేందర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీ చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనతో సీఐ అసభ్యకరంగా చాటింగ్ చేశాడని బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలంటూ చాటింగ్ చేశాడని పేర్కొంది. మెసేజ్‌లను చూయించింది. దీంతో సీఐను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

News July 20, 2024

భద్రాచలం వద్ద 34 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం మధ్యాహ్నం 1 గంటకు 34 అడుగుల మేర ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు.

News July 20, 2024

HYD: అప్పులు చేసిన ఘనత KCRది: మహేశ్ కుమార్ గౌడ్

image

పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మాజీ సీఎం KCRది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, MLCమహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పలువురు BRS నుంచి కాంగ్రెస్‌లో చేరగా ఆయన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రూ.2లక్షల రుణమాఫీ చేసి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని కొనియాడారు. BRS హయాంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?

News July 20, 2024

HYD: అప్పులు చేసిన ఘనత KCRది: మహేశ్ కుమార్ గౌడ్

image

పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మాజీ సీఎం KCRది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, MLCమహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పలువురు BRS నుంచి కాంగ్రెస్‌లో చేరగా ఆయన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రూ.2లక్షల రుణమాఫీ చేసి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని కొనియాడారు. BRS హయాంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?

News July 20, 2024

కట్టంగూర్: లారీ, డీసీఎం ఢీ.. ఒకరి మృతి

image

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని, పంజాబ్ రాష్ట్రానికి చెందిన డీసీఎం వాహనం శనివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.