Telangana

News July 20, 2024

లష్కర్‌ బోనాల ఏర్పాట్లు పరిశీలించిన పొన్నం

image

రేపు, ఎల్లుండి లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ అధికారులు, పోలీసులను ఆయన ఆదేశించారు. బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

News July 20, 2024

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

image

అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరద ప్రవాహాల వద్దకు సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదాలకు బారిన పడవద్దని, అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేసి సాయం పొందాలని, శిథిలావస్థకు వచ్చిన నివాసాల్లో ఉండవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని, చెరువులు, వాగులు వద్దకు వెళ్లకూడదన్నారు.

News July 20, 2024

లష్కర్‌ బోనాల ఏర్పాట్లు పరిశీలించిన పొన్నం

image

రేపు, ఎల్లుండి లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ అధికారులు, పోలీసులను ఆయన ఆదేశించారు. బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. 

News July 20, 2024

కాజీపేట నుంచి ప్రత్యేక రైళ్ల పొడిగింపు

image

సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా పట్నా, దానాపూర్ నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 03253 పట్నా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 వరకు, 07255 హైదరాబాద్- పట్నా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 2 వరకు, 03225/26 దానాపూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 29 వరకు పొడిగించారు. రైళ్లలో రద్దీ అధికంగా ఉండటం వల్ల రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

News July 20, 2024

మంథని: బస్టాండ్‌లో చేపలు పడుతున్న ప్రయాణికులు

image

మంథని మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు చిన్న పాటి చెరువును తలపించేలా మారిపోయింది. బస్టాండ్‌లోకి వరద రావడంతో అందులో చేపలు కనబడుతున్నాయని ప్రయాణికులు నీటిలోకి దిగారు. వారు చేపలు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

News July 20, 2024

NZB జిల్లా ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ 

image

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నగరంలోని మానిక్ భండార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం శుక్రవారం రాత్రి ఆసుపత్రికి వచ్చాడు. రాత్రి తన మూడేళ్ల బాలుడితో కలిసి ఆసుపత్రి కారిడార్‌లో నిద్రించాడు. లేచి చూసేసరికి బాలుడిని ఎవరో ఎత్తుకెళ్లరాని బాధితుడు తెలిపాడు. వెంటనే ఆసుపత్రిలో ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో వారు కేసు నమోదు చేశారు.

News July 20, 2024

గోదావరిలో గల్లంతైన రాజు మృతదేహం లభ్యం

image

ఆలుబాకకు చెందిన బానారి రాజు చేపలకు వేటకు వెళ్లి గోదావరిలో ప్రమాదవశాత్తు నిన్న గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం రాజు మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. రాజు మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News July 20, 2024

ప్రాజెక్టు తెలంగాణలో.. ఆయకట్టు ఆంధ్రాలో!?

image

పెద్దవాగు కథ చాలా పెద్దదే. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు తెలంగాణలో ఆయకట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రాజెక్టు కు భారీ వర్షాలకు గండి పడింది. చుక్కనీరు లేకుండా పోయింది. 18 వేల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా మారింది. ఏజెన్సీ వర ప్రధాయినిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు అశ్వారావుపేట మండలంలో ఉంది. దాని ఆయకట్టు మాత్రం ఏపీలోని ఏలూరు జిల్లాలో విలీనమైన వేలేరుపాడు మండలంలో ఉంది.

News July 20, 2024

బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు‌ లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్‌ బలగం‌ అంతా రేపు సికింద్రాబాద్‌‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు‌ కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు. ‌

News July 20, 2024

బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు‌ లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్‌ బలగం‌ అంతా రేపు సికింద్రాబాద్‌‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు‌ కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు. ‌