Telangana

News July 20, 2024

HYD: దేశంలోనే NO.1 సీఎం రేవంత్ రెడ్డి: మల్లు రవి

image

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ప్రారంభించి రేవంత్ రెడ్డి దేశంలోనే నంబర్-1 సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురాంరెడ్డి అన్నారు. HYD గాంధీభవన్‌లో వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. కేవలం 7నెలల్లోనే ప్రజల కోసం ఎన్నో పనులు చేశారన్నారు. BRSపదేళ్లు అధికారంలో ఉన్నా రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేయలేదని మండిపడ్డారు.

News July 20, 2024

గోదావరి వరద తీవ్రత పై సీఎం ఆరా..!

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో వరద తీవ్రతపై CM రేవంత్ రెడ్డి జిల్లా అధికారుల నుంచి ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద భారీగా వస్తున్న కారణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. అలాగే పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. కాగా సెలవుల్లో కూడా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News July 20, 2024

భద్రాచలం వద్ద మరో అడుగు పెరిగిన గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం గోదావరి వద్ద ఉ.9 గంటలకు గోదావరి నీటిమట్టం మరో అడుగు పెరిగిందని CWC అధికారులు తెలిపారు. 32.2 అడుగులకు నీటిమట్టం చేరిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.

News July 20, 2024

26 నుంచి బీటెక్ రెండో, మూడో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీలో జులై 26 నుంచి ఇంజినీరింగ్ బీటెక్ రెండో, మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. జులై 26, 30, ఆగస్టు 1,3,5 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 2, 3 సెమిస్టర్లకు చెందిన రెగ్యులర్, సప్లమెంటరీ, ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు.

News July 20, 2024

నల్గొండ: ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ మృతి

image

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన నార్కట్ పల్లి మండలం పల్లెపహాడ్‌లో జరిగింది. ఎస్సై అంతిరెడ్డి వివరాలిలా.. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడింది.  డ్రైవర్ మంటిపల్లి నర్శింహా బురదలో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక మృతిచెందాడు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది. 

News July 20, 2024

HYD: 80 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు

image

చార్మినార్ జోన్‌లో 80 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తూ మల్టీ జోన్-2 ఐజీపీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ పరిధి హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల యూనిట్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని పదోన్నతులు కల్పించామన్నారు. అడ్ హక్ ప్రాతిపదికన కల్పించిన పదోన్నతులు ప్రభుత్వం నిబంధనల మేరకు ఆమోదం పొందుతాయని చెప్పారు.

News July 20, 2024

అటవీ గ్రామాలను చుట్టుముడుతున్న వాగులు

image

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చర్ల మండలంలోని గ్రామాలను వాగులు చుట్టు ముడుతున్నాయి. కుర్నపల్లి పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ వాగులు కమ్మేయడంతో బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. కుర్నపల్లి-రామ చంద్రాపురం మధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు ప్రభుత్వంగా ఉండాలని అధికారులు సూచించారు

News July 20, 2024

NGKL: మద్యం తాగించి మహిళ కూలీలపై అత్యాచారం

image

ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన NGKL జిల్లా అచ్చంపేట సమీపంలోని హాజీపూర్ హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగింది. బల్మూర్ మండలంలోని వేరువేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు రోజువారీ పనికి వచ్చారు. బండల వ్యాపారం నిర్వహించే వినోద్ సింగ్, గజానంద్ అనే వ్యక్తులు ఇద్దరు మహిళలను కూలీ పనికి తీసుకెళ్లారు. వారిని కారులో ఎక్కించుకొని మద్యం తాగించి అత్యాచారం చేశారు. కేసు నమోదైంది.

News July 20, 2024

జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సీఎస్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల అశ్వరావుపేటలోని పెద్దవాగుకు గండిపడి భారీగా వరద సంభవించింది. ఈ ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందిని ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో అభినందించారు.

News July 20, 2024

వర్షానికి పొలాల్లో నిలిచిన నీరు.. జాగ్రత్తలు పాటించండి!

image

ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలుస్తోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది, పత్తి, జొన్న, పెసర, మినుముతో పాటు వరి, మిరప, ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షం నీరు నిలవకుండా మురుగుకాల్వలు ఏర్పాటుచేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.