India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గర్ల్స్ హాస్టల్లో సాంబారులో పురుగు ఘటనపై టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి చర్యలు చేపట్టారు. ఈ మేరకు హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ మేరకు కమిటీ విచారణ జరిపి ఘటనకు గల కారణాలను తెలుసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేర్ టేకర్ల 24గం.ల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పర్యవేక్షణా నిమిత్తం ఐదుగురు మహిళా ఆచార్యులతో కమిటీని నియమించారు.
ఖమ్మం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జలాశయాలు, చెరువులు, వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో సహకారం అందించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 87126 59111 అందుబాటులో వుంటుందని, సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండి ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాలుగు గోడల మధ్య తాము నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో భేషజాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి చేసిందని ఆరోపించారు.
ప్రభుత్వం రుణమాఫీ చేస్తుండటంతో సైబర్ మోసాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట డీఎస్పీ లింగయ్య శుక్రవారం అన్నారు. సైబర్ కేటుగాళ్లు బ్యాంకుల ఫోటోతో వాట్సాప్లో APK ఫైల్స్ పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నాని హెచ్చరించారు. ఫోన్లకు వచ్చే అనవసర లింకులు ఓపెన్ చేయవద్దని చెప్పారు. సందేహాలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి నివృత్తి చేసుకోవాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్నగర్లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్బిహేవ్ చేశాడని విచక్షణ రహితంగా దాడి చేయడంతో చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.
అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్నగర్లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్బిహేవ్ చేశాడని విచక్షణ రహితంగా దాడి చేయడంతో చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.
నిజామాబాద్ నగరంలో కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాలనీల్లో కుక్కల బెడద ఉంటే 08462-220234 నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా కాలనీల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ టీంలను రంగంలోకి దించారు. బృందాల సభ్యులు వీధుల్లోని శునకాలను పట్టుకుని వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు.
ఉపకార వేతనాల కోసం ఇంటర్ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో 2023-24 సంవత్సరంలో విద్యనభ్యసించిన వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పర్యటించారు. పర్యటనలో భాగంగా వృద్ధురాలితో మాట్లాడి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా రంజక పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.
Sorry, no posts matched your criteria.