Telangana

News March 25, 2024

మెదక్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ !

image

మెదక్‌ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన BRS.. నియోజకవర్గంలో తన కార్యాచరణను ప్రారంభించింది. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఒకటైన మెదక్‌‌పై కేసీఆర్ దృష్టిసారించారు. రేపటి నుంచి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యనేతలతో KCR సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటూ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన హరీశ్‌రావు.. మెదక్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

News March 25, 2024

మగువ.. ఆత్మరక్షణ విద్యతో తెగువ

image

ప్రస్తుత సమాజంలో బాలికలకు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్య అవశ్యం. శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. తమను తాము రక్షించుకోవడం సహ ఒకానొక సందర్భంలో ఇతరులకు అండగా మారొచ్చు. దీనివల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వేధింపులకు గురైతే నేరుగా ఎదుర్కోగలుగుతారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో కరాటే శిక్షణ నేర్పుతున్నారు.

News March 25, 2024

హన్మకొండలో కారు- బైక్ ఢీ.. ఒకరు అక్కడికక్కడే మృతి

image

హన్మకొండ నిట్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని సురేందర్ బైకుపై వెళుతున్నాడు. ఈ క్రమంలో బైకును ఓ కారు ఓవర్ టెక్ చేస్తుండగా ఢీకొంది. ఈ ఘటనలో సురేందర్ అక్కడికిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించారు.

News March 25, 2024

నిజామాబాద్: అమ్మాయి కోసం యువకుల గొడవ

image

ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన HYDఅమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌ వాసులు నితిన్‌, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వెళ్లింది. అక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.

News March 25, 2024

HYD: గాంధీలో గర్భిణులకు కొండంత అండగా వైద్యం!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని MCH భవనంలో పిల్లలకు, గర్భిణులకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 600 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నట్లు డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. 300 నుంచి 400 వరకు గైనిక్ సమస్యలు ఉన్నవారు ఓపీ తీసుకుంటున్నారని అన్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనాలకు మాత శిశు సంరక్షణ భవనాలకు అనుసంధానం చేసేలా స్కైవాక్ వంతెన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News March 25, 2024

HYD: గాంధీలో గర్భిణులకు కొండంత అండగా వైద్యం!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని MCH భవనంలో పిల్లలకు, గర్భిణులకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 600 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నట్లు డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. 300 నుంచి 400 వరకు గైనిక్ సమస్యలు ఉన్నవారు ఓపీ తీసుకుంటున్నారని అన్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనాలకు మాత శిశు సంరక్షణ భవనాలకు అనుసంధానం చేసేలా స్కైవాక్ వంతెన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News March 25, 2024

ADB: ఈనెల 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం

image

కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ చదువుతున్న రెగ్యులర్, బ్యాక్ లాక్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం తెలిపారు. సెమిస్టర్-2, 4, 6 విద్యార్థులు ఈ ఫీజును చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

News March 25, 2024

MBNR: కలర్ పడుద్ది.. కళ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు ఈ వేడుక జరుపుకొనేందుకు పాలమూరు ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

News March 25, 2024

HYD: అందెశ్రీ దంపతులను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దంపతులు ఆదివారం ఘనంగా సన్మానించి అభినందిచారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.. రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

News March 25, 2024

HYD: అందెశ్రీ దంపతులను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దంపతులు ఆదివారం ఘనంగా సన్మానించి అభినందిచారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.. రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.