Telangana

News July 19, 2024

నియోజకవర్గాల వారీగా రుణమాఫీ వివరాలు2/2

image

☞కొడంగల్:17,975 <<13659589>>రైతులకు <<>>99.84 కోట్లు☞అచ్చంపేట:15.990 రైతులకు 92.44 కోట్లు☞కొల్లాపూర్:16,982 రైతులకు 82.81 కోట్లు☞వనపర్తి:16,071 రైతులకు 83.84 కోట్లు☞దేవరకద్ర:16,621 రైతులకు 87.94 కోట్లు☞కొల్లాపూర్:16,982 రైతులకు 91.58 కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యాయి. ఇందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి స్థానంలో కల్వకుర్తి, మహబూబ్ నగర్ నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది. – SHARE IT

News July 19, 2024

MBNR: నియోజకవర్గాల వారీగా రుణమాఫీ వివరాలు 1/2

image

తొలి విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా రూ.లక్ష లోపు <<13659616>>రుణమాఫీ <<>>వివరాలు..
☞MBNR:5,829 రైతులకు 30.85 కోట్లు
☞NGKL:14,348 రైతులకు 81.75 కోట్లు
☞జడ్చర్ల:14,349 రైతులకు 80.09 కోట్లు
☞మక్తల్:12,107 రైతులకు 72.75 కోట్లు
☞షాద్ నగర్:13,462 రైతులకు 70.31 కోట్లు
☞గద్వాల్:10,099 రైతులకు 61.28 కోట్లు
☞NRPT:14,774 రైతులకు 82.24 కోట్లు
☞కల్వకుర్తి:18,196 రైతులకు 103.02 కోట్లు – SHARE IT

News July 19, 2024

మెదక్: EMT ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

EMR గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న EMT ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జనార్ధన్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు 20 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 19, 2024

ఏసీబీకి చిక్కిన మత్స్యశాఖ అధికారి

image

సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి చిక్కాడు. రూ. 25వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మత్స్యశాఖ సోసైటి సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఏసీబీ అధికారలకు ఫిర్యాదు చేశారు.

News July 19, 2024

HYD: రవి గుప్తా బాధ్యతల స్వీకరణ

image

రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్‌ల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

News July 19, 2024

HYD: రవి గుప్తా బాధ్యతల స్వీకరణ

image

రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్‌ల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

News July 19, 2024

పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ఎప్పుడో?

image

పెద్దపల్లి ప్రజలకు ఆర్టీసీ డిపో ఏర్పాటు 30 ఏళ్లుగా కలగానే మిగిలింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా సాధ్యం కాలేదు. డిపో ఏర్పాటుకు పెద్దపల్లిలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై పాలకులు దృష్టి సారించడం లేదు. కాగా ప్రభుత్వం రెండు రోజుల క్రితం మోత్కూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి పెద్దపల్లికి ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

News July 19, 2024

వరంగల్ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.7,245

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.7,245 పలికింది. గత వారం రూ.7,400 పలికిన పత్తి ధర.. ఈ వారం క్రమంగా తగ్గడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వారంలో పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,310, మంగళవారం రూ.7,350, బుధవారం మార్కెట్ బంద్, గురువారం రూ.7,235కి పలికాయి.

News July 19, 2024

చిరుతదాడి నుంచి తప్పించుకున్న లైన్‌మన్

image

ఖిల్లాఘనపురం మండలంలోని మామిడిమాడ సబ్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్‌మన్ పరమేశ్వర్ తృటిలో చిరుతదాడి నుంచి తప్పించుకున్నాడు. గురువారం విధుల్లో భాగంగా జంమాయపల్లి నుంచి మామిడిమాడ తండాకు వస్తుండగా మార్గమధ్యలో చిరుత ఆయన దగ్గరకు వస్తూ కనిపించింది. ఒక్కసారిగా తన బైక్ వేగం పెంచి పులి నుంచి తప్పించుకొని తండాకు వచ్చాడు. ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకుని తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

News July 19, 2024

వెంకటాపురం-వాజేడు: ఆకట్టుకుంటున్న గడి చెరువు జలపాతం

image

ములుగు జిల్లా వెంకటాపురం-వాజేడు మండలాల సరిహద్దు అభయారణ్యంలోని మహితాపురం, బొల్లారం గ్రామాల సమీపంలో ఉన్న గడి చెరువు జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎత్తయిన గుట్టలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. గుట్టలపై నుంచి జాలువారుతున్న జలధారలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. మరి మీరు ఈ జలపాతం చూశారో కామెంట్ చేయండి.