Telangana

News July 19, 2024

కూసుమంచి: ‘ఆ పాద ముద్రలు చిరుతవి కావు’

image

కూసుమంచి మండలంలోని మునిగేపల్లి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు గుర్తించిన పాద ముద్రలు చిరుత పులివి కావని అటవీ రేంజి అధికారి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో పాదముద్రలను గుర్తించిన కౌలు రైతు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చాడు. గ్రామ కార్యదర్శి నరేశ్ ద్వారా సమాచారం అందుకున్న రేంజర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

News July 19, 2024

మెదక్: యాసిడ్ తాగి వ్యక్తి మృతి

image

అప్పులు తీర్చలేక ఓ వక్తి యాసిడ్ తాగాడు. ఈ ఘటన తూప్రాన్‌లో జరిగింది. ఎస్సై శివానందం వివరాలు.. పట్టణానికి చెందిన నరసింహచారి(40) నాలుగేళ్ల క్రితం ఇల్లు కొనుగోలు చేశాడు. బ్యాంకులో రూ.17లక్షలు, ఇతరుల వద్ద రూ.6లక్షలు అప్పు చేశాడు. డబ్బు చెల్లించే పరిస్థితి లేక తన దుకాణంలో బంగారం కరిగించేందుకు ఉపయోగించే యాసిడ్ సేవించాడు. పక్కనే ఉన్న దుకాణదారుడు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News July 19, 2024

MBNR: తొలి మ్యాచ్‌లో మన పాలమూరు జట్టు ఘన విజయం

image

HCA ఏ1 డివిజన్ 3డే లీగ్ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జట్టు సాయి సత్య క్రికెట్ క్లబ్(సికింద్రాబాద్) జట్టుపై 204 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి త్రీడే విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉమ్మడి జిల్లా అధికారులు అభినందించారు. 64 పరుగులు చేసిన షాదాబ్‌కు సంఘం కోశాధికారి ఉదేశ్ కుమార్ రూ.20వేలు విలువ చేసే బ్యాట్‌ను ప్రదానం చేశారు. ♥CONGRATULATIONS

News July 19, 2024

వరంగల్: నేడు భారీ వర్షం

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. MHBD, MLG జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, HNK, WGL, BHPL ఆరెంజ్‌, జనగామకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ వరంగల్‌లో వరద ముంపు, వర్షపు నీళ్ల ఆగడం తదితర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 1980, సెల్‌ నంబరు 97019 99645 సంప్రదించాలని కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ప్రకటనలో కోరారు.

News July 19, 2024

నిజామాబాద్: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సునీత తీర్పు వెల్లడించారు. వివరాలిలా.. ఆలూరు(M)కు చెందిన గంగుకు తన కోడలితో గొడవలు జరిగేవి. ఈ విషయాన్ని వెంకటి అనే వ్యక్తికి చెప్పడంతో అతడు నగలు దోచుకోవాలనే దురుద్దేశ పడ్డాడు. గొడవ పడకుండా ఉండేందుకు పూజలు చేయాలని చెప్పాడు. 2022 SEP 27న ఓ మడుగులో స్నానం చేయాలని చెప్పాడు. ఆమె నీటిలో దిగగానే మెడకు చీర చుట్టి చంపేశాడు.

News July 19, 2024

ఆదిలాబాద్ జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వివిధ గ్రామాల్లో 100కు పైగా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోగులు వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోగులకు సూచిస్తున్నారు.

News July 19, 2024

కరీంనగర్: 1,30,709 మంది రైతుల రుణమాఫీ

image

పంట రుణమాఫీ నిధుల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 1,30,709 మంది రైతులకు రూ.688.44 కోట్ల పంట రుణమాఫీ నిధులు రానున్నాయి. ఇందులో కరీంనగర్‌‌లో 37,745 మంది రైతులకు రూ.194.64 కోట్ల నిధులు, జగిత్యాలలో 39,253 మంది రైతులకు రూ.207.99 కోట్లు, పెద్దపల్లిలో 29,725 రైతులకు రూ.149.43 కోట్లు, సిరిసిల్లలో 23,986 మంది రైతులకు రూ.136.36 కోట్ల నిధులను విడుదల చేశారు.

News July 19, 2024

రైతు రుణమాఫీ పేరిట లింకులు వస్తే ఓపెన్ చెయొద్దు

image

రైతు రుణమాఫీ అంటూ ఫోన్‌కు లింకులు వస్తే ఓపెన్ చెయొద్దని SP ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఏదైన కార్యక్రమం ప్రారంభించగానే సైబర్ నేరగాళ్లు అదే పేరిట ఆన్‌లైన్ మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైన సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌ చేయడం, దగ్గర్లోని PSలో ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును రికవరీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News July 19, 2024

HYD: ఉజ్జయినీ బోనాలు.. కీలక మార్పులు

image

ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

News July 19, 2024

HYD: ఉజ్జయినీ బోనాలు.. కీలక మార్పులు

image

ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.