Telangana

News July 18, 2024

ముఖ్యమంత్రితో VC లో మాట్లాడిన బోధన్ యువ రైతు

image

రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బోధన్ మండలానికి చెందిన యువ రైతు రవి మాట్లాడారు. రూ. 2 లక్షల రుణమాఫీ అమలులోకి తెచ్చి రైతాంగానికి ఎనలేని భరోసా అందించారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రుణమాఫీతో రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు.

News July 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి.
@ ధర్మారం మండలంలో రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల సంబరాలు.
@ భీమారం మండలంలో పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వర్షం.

News July 18, 2024

పెద్దవాగు వరద పరిస్థితిపై సీఎస్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

image

అశ్వారావుపేట మండల పరిధిలోని పెద్దవాగు వరద పరిస్థితిపై గురువారం సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాగా పెద్ద వాగు వరద ఉధృతిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సీఎస్ కు వివరించారు.

News July 18, 2024

ఆదిలాబాద్: ప్రజాపాలన సేవాకేంద్రం ప్రారంభం

image

ప్రజాపాలన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు రాని దరఖాస్తుదారులు ప్రజాపాలన సేవా కేంద్ర ద్వారా డేటా సవరణ చేసుకోవచ్చని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో సీపీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ప్రారంభించారు. సవరణ కొరకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్పిజి కస్టమర్ ఐడి తీసుకెళ్ళలని సూచించారు.

News July 18, 2024

జూరాల ప్రాజెక్టుకు వరద నీరు

image

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 1500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.140 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తి నీటి నిల్వ ప్రస్తుతం 6.987 టీఎంసీలుగా నమోదైందని అధికారులు తెలిపారు.

News July 18, 2024

NLG: మరో మూడు రోజులు గడువు తేదీ పొడగింపు

image

NLG జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలలో 2024-25/26 సంవత్సరం (ఒకటి & 2 సంవత్సరాల కోర్సులకు) అడ్మిషన్ కొరకు రెండవ విడత ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని ఈ నెల 21 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా ఐటిఐల కన్వీనర్/ ప్రిన్సిపాల్ ఎ. నర్సింహ్మ చారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 18, 2024

వర్షం వల్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల తాడిచర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 80 వేల మెట్రిక్ టన్నుల ఓబీ తవ్వకాలు, 4000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు మైన్ అధికారులు తెలుపుతున్నారు. మైండ్ మొత్తం బురదమయంగా మారడంతో పాటు ఓసీపీలోకి వరద నీరు వచ్చి చేరింది. మోటార్ల సాయంతో వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

News July 18, 2024

రేపు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మంత్రుల పర్యటన

image

రేపు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు ,తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలు ఖరారయ్యింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో అయిల్ ఫాం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, 11:40కి మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకల్లో, 1 గంటలకు కరీంనగర్లోని ఓ కన్వెన్షన్లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News July 18, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.60,790 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.24,416, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.21,600, అన్నదానం రూ.14,774 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.

News July 18, 2024

సంగారెడ్డి: EMT ఉద్యోగులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలో EMRI సంస్థ 108లో EMT ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు Bscనర్సింగ్, లైఫ్ సైన్స్, Bఫార్మా, GNM, DMLT కోర్సులు పూర్తిచేసి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే ఇంటర్వ్యూలకు సకాలంలో హాజరు కావాలన్నారు.