India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అశ్వరావుపేట మండలం రామచంద్రపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నగొలుసుపాటి అంజిమూర్తిని గుర్తుతెలియని వాహనం ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఏలూరు జిల్లా తడికలపూడి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరులో నిన్న, ఈరోజు నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాప్ట్ బాల్ బాలుర చాంపియన్షిప్లో మెదక్ జిల్లా బాలుర జట్టు రజత పథకం సాధించినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కోడిప్యాక నారాయణ గుప్త తెలిపారు. జిల్లా జట్టులో శ్రీరామ్ చాంపియన్షిప్ ఉత్తమ క్యాచర్ అవార్డ్ లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జట్టును అజయ్ కుమార్ గౌడ్, శ్యామ్ సుందర్ శర్మ అభినందించారు.
HYD ఎంపీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలవగా ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈసారి కూడా అసదుద్దీన్ గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
HYD ఎంపీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలవగా ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈసారి కూడా అసదుద్దీన్ గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు ఆదివారం ఇంద్రపూర్ సమీపంలోని ప్రైవేటు ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మరమ్మతు కేంద్రానికి చుట్టు పక్కల ఇళ్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో ఎండ తీవ్రతకు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల కారణంగా అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అచ్చంపేట మండలం అయినోలులో 40.7 డిగ్రీలు నమోదు కాగా, బిజినేపల్లి మండలంలో 40.5 నమోదయ్యాయి.
HYDలోని వివిధ మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి ఛార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్లలో టాయిలెట్ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపి వేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిశీలించి మెట్రో ప్రయాణికులందరికీ మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
HYDలోని వివిధ మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి ఛార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్లలో టాయిలెట్ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపి వేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిశీలించి మెట్రో ప్రయాణికులందరికీ మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
పొంగులేటిపై అభిమానాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా చాటారు. ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడుకు చెందిన గంధసిరి సత్తయ్య తన కుమారుడి పెళ్లి పత్రికపై పొంగులేటి దంపతుల ఫొటోను ముద్రించారు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్ లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.