India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామ సమీపంలో ని బసవేశ్వర కాటన్ మిల్లులో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కన ఉన్న రైస్ మిల్లు కార్మికులు గమనించి యజమానికి, పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదంలో సుమారు 8 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని తెలిపారు.
ఎన్నికల నియమావళి లో భాగంగా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేని రెండు లక్షల నగదును ఆదివారం అధికారులు సీజ్ చేశారు. మహారాష్ట్ర కు చెందిన ఓ కారును ఎన్నికల సిబ్బంది తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో రూరల్ సీఐ ఫణిందర్, తలమడుగు ఎస్ఐ ధనశ్రీ, ఎస్ఎస్టీ సభ్యులు తదితరులు ఉన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరిలో వింత గుడ్లగూబ ప్రత్యక్షమైంది. దీనిని బార్ను గుడ్లగూబ అంటారని, ఇది ఎడారి ప్రాంతాలు హిమాలయాలకు ఉత్తరాన ఉన్న ఆసియా, ఇండోనేషియాలోని కొన్ని దీపాలలో మాత్రమే కనిపిస్తాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దాని ముఖం మనిషి పోలిక ఆకారంతో ఉండడంతో దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఈనెల 28న జరగనున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. గత పదేళ్ల BRS పాలనపై వ్యతిరేకతతో కాంగ్రెస్కే ఓటు వేస్తారని ఆ పార్టీకి చెందిన నాయకులు ధీమాతో ఉన్నారు. BRS నాయకులు సైతం గెలుపు మాదే అని చెబుతున్నారు.
ఖమ్మం రామన్నపేట కాలనీలో దారుణం జరిగింది. గంజాయి, మద్యం మత్తుకు బానిసైన కొడుకు తల్లిని కిరాతకంగా హతమార్చాడు. మృతురాలు గౌరీపెద్ది రామలక్ష్మి(మీరాబి) వికలాంగురాలు. ఆమెకు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. తల్లిని కర్రతో తలపై బాధడంతో మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నల్గొండ నుంచి ప్రధాన పార్టీలు తమ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ముగ్గురు ఆర్థికంగా బలం ఉన్న నాయకులే. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుందని నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
నిర్మల్ జిల్లా నాయకులు BRSను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ మాజీ మండల అధ్యక్షులు ఆయిండ్ల పోశెట్టి, మంజులాపూర్ మాజీ సర్పంచ్ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి మంత్రి ఆహ్వానించారు.
కోకాపేటలో కర్ణాటక నుంచి HYDకు డీజిల్ను తరలిస్తున్న ముఠాను శంషాబాద్ SOT పోలీసులు గుట్టురట్టు చేశారు. ట్యాంకర్లలో డీజీల్ను తెచ్చి HYD శివారు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లు సీజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.
కర్ణాటక నుంచి HYDకు డీజిల్ను తరలిస్తున్న ముఠాను కోకాపేటలో శంషాబాద్ SOT పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్లలో డీజీల్ను తెచ్చి HYD శివారు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లు సీజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కోసం అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డితో పాటు వెలిచాల రాజేందర్రావు పేరు వినిపిస్తోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ప్రవీణ్ రెడ్డి పోటీచేయాల్సి ఉండగా.. పొన్నం కోసం వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించడానికి అధిష్ఠానం యోచించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే రెడ్ల ఎక్కువ టికెట్లు వెళ్తుండటం ఇతరులకు టికెట్ ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.