Telangana

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. >>>SHARE IT

News March 24, 2024

గుడిహత్నూర్: కౌలు రైతు ఆత్మహత్య

image

పంట దిగుబడులు రాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహాత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మన్నూరు గ్రామానికి చెందిన రైతు జాదవ్ రాజారాం (56) 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. రబీలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల దిగుబడి రాక మనస్తాపానికి గురైన రాజారాం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 24, 2024

గద్వాల: ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి

image

బావిలో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. దేవేందర్ గౌడ్, జయలక్ష్మి దంపతుల కుమారుడు భూపతి గౌడ్(17) ఇంటర్ పరీక్షలు ముగియగా.. ఖాళీగా ఉన్నాడు. ఓ బావిలో ఈత కొడుతుండగా.. పూడికలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

News March 24, 2024

మెదక్: దారుణ హత్య చేసిన దొంగ బాబా

image

పూజలు చేస్తానని నమ్మించి ఓ మహిళను హత్య చేసిన దొంగ బాబా నర్సింగ్ రామ్ అలియాస్ శివను జిన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరన్నగూడెంకు చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేస్తానని నమ్మించి ఘట్‌‌కేసర్ పరిధిలోని మాదారం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బంగారు గొలుసు కోసం బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. శివపై పలు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.

News March 24, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

News March 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} భద్రాచలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News March 24, 2024

మహబూబ్ నగర్: విస్తరిస్తున్న క్షయ మహమ్మారి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. 2022లో  జిల్లాలో క్షయ బాధితులు 7,187 మంది ఉండగా.. 2024లో ఇప్పటి వరకు 8,612 మంది రోగులు నమోదయ్యారు. ఒక్క ఏడాదిలోనే వారి సంఖ్య 1,425 మంది పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో 80 శాతం కేసులు వస్తుండగా,  ప్రైవేట్ ఆసుపత్రుల్లో 20 శాతం మంది చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 క్షయ యూనిట్ల ఆసుపత్రులు ఉన్నాయి.

News March 24, 2024

KTDM: ప్రేమ వివాహం చేసుకుందని బ్లేడుతో దాడి

image

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఘటనపై బూర్గంపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి ఈనెల 11న కులాంతర వివాహం చేసుకుంది. ఈ క్రమంలో యువతి తండ్రి కుమార్తెను చూడడానికి వెళ్లి ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న బ్లేడుతో దాడి చేశాడు. గాయపడిన బాధితురాలు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు.

News March 24, 2024

జగిత్యాల: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

image

గొల్లపల్లి మండలం దట్నూరుకు చెందిన హరికృష్ణ A/S హరీష్ కిరాణం నిర్వహిస్తుండేవాడు. సరుకుల కోసం వచ్చే బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా 2022 ఏప్రిల్ 7న పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. శనివారం నేరం రుజువు కావడంతో JGL న్యాయమూర్తి నీలిమ ఒక్కోకేసులో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా, ముగ్గురు బాలికలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.

News March 24, 2024

వరంగల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ముంజలకుంటతండాకి చెందిన రమావత్ వెంకన్న కొత్త ఇంటికి అవసరం నిమిత్తం శనివారం మోటార్‌ను బిగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకన్న కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం MGMకు తరలించారు.