India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్ను అందిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గురువారం జగిత్యాల పట్టణంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
అరుణాచలంలో ఈనెల 21న గురు పౌర్ణమి సందర్భంగా HNK నుంచి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు నర్సంపేట RTC DM లక్ష్మి తెలిపారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు HNK నుంచి బయల్దేరుతుందన్నారు. ఈ బస్సు సర్వీసులో కాణిపాక వరసిద్ధి వినాయక, వేలూరు మహాలక్ష్మి అమ్మవారు, జోగులాంబ అమ్మవారి దర్శన అవకాశం ఉంటుందని తెలిపారు. NSPT ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఖమ్మం నగరం-ఖమ్మం రూరల్ మండలాల మధ్య నాయుడుపేట సమీపాన మున్నేరుపై ఉన్న పాతవంతెన స్థానంలో నిర్మిస్తున్న తీగల వంతెన పనులు చకచకా సాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు కాగా.. 700 మీటర్ల మేర తీగల వంతెన నిర్మిస్తారు. మిగతాది అప్రోచ్ వంతెన ఉండనుంది. నాలుగు నెలలు క్రితం పనులు మొదలు పెట్టగా ఇప్పటికే మున్నేరులో వంతెనకు అవసరమైన పిల్లర్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది.
నిజామాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా శనివారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 17వేల ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.16వేలు పలికింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి రూ. 14వేల ధర వచ్చింది. అయితే మొన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గ్రేటర్ HYDలో కుక్కలు రక్తం మరిగాయి. నిత్యం <<13652139>>కుక్క కాటు కేసులు<<>> నమోదవుతూనే ఉన్నాయి. కాగా రాజధాని పరిధిలో కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలను కుక్కలకు వేయడంతో అవి నాన్ వెజ్ తినేందుకు బాగా అలవాటు పడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మాంసానికి అలవాటు పడి పిల్లలపై దాడి చేస్తున్నాయని అంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
గ్రేటర్ HYDలో కుక్కలు రక్తం మరిగాయి. నిత్యం <<13652139>>కుక్క కాటు కేసులు<<>> నమోదవుతూనే ఉన్నాయి. కాగా రాజధాని పరిధిలో కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలను కుక్కలకు వేయడంతో అవి నాన్ వెజ్ తినేందుకు బాగా అలవాటు పడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మాంసానికి అలవాటు పడి పిల్లలపై దాడి చేస్తున్నాయని అంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
చిన్నంబావి మండలంలోని లక్ష్మీ పల్లికి చెందిన బీఆర్ఎస్ నేత బొడ్డు శ్రీధర్ రెడ్డి (52) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐజీ వి.సత్యనారాయణ, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జిల్లా ఎస్పీ గిరిధర్ రావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు సంఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించి స్థానికులు, కుటుంబ సభ్యులతో వివరాలు తెలుసుకున్నారు. సీఎం, డీజీపీ ఆదేశాల మేరకు కేసు విషయమై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నిజామాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా శనివారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.