India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు పతనమవుతూ వస్తుంది. ఈ క్రమంలో గత రెండు రోజులతో పోలిస్తే పత్తి ధర ఈరోజు తగ్గింది. సోమవారం రూ.7,310 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,350కి చేరింది. నిన్న మార్కెట్ బంద్ ఉండగా.. ఈరోజు ప్రారంభమై రూ.7,235కి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-2లో బుధవారం జరిగిన ప్రమాదంలో భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన ఉద్యోగి వెంకటేశ్వర్లు మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబం కొన్నేళ్ల కిందటే గోదావరిఖనిలో స్థిరపడింది. సింగరేణి విధులకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారనే విషయం తెలుసుకొని ఆయన మిత్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎగువన భారీ వర్షాలు కురస్తుండడంతో తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతుంది. చర్ల తాలిపేరు ప్రాజెక్టుకు 4 గేట్లు పూర్తిగా, 21 గేట్లు 2 అడుగులు మేర ఎత్తివేయడంతో 68 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లు ఎత్తారు.
రాష్ట్రంలో రైతులకు రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న వారికి ప్రభుత్వం గురువారం రుణమాఫీ చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో 7,528 మంది రైతులకు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రైతులు సా.4 గంటలకు నియోజకవర్గంలో సంబరాలు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేర్కొన్నారు.
పర్వతగిరి మండలంలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. SI వెంకన్న వివరాలు.. ఇంటర్ చదువుతున్న G.ఐశ్వర్య(16) కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందగా.. అందుకు M.ఛత్రపతి అనే వ్యక్తి కారణమని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మెడకు ఉరేసుకున్నట్లు, మృతదేహం పక్కన చీర పడి ఉంది. ఛత్రపతికి ఐశ్వర్యకు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిందని SI తెలిపారు.
ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో జరిగింది. CI నాగరాజు వివరాలు.. బీరంగూడలోని రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సుమంత్ (30) రుణం తీసుకొని ఇల్లు కొన్నారు. కాగా రుణం వాయిదాలు చెల్లించడానికి అతడికి డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది.దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈసారి ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఖమ్మం జిల్లాలోని ఆరు ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు షిఫ్ట్ లో పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. మొత్తం 25,204మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా DSC పరీక్షలు గురువారం ప్రారంభమై ఆగస్టు 7వరకు జరగనున్నాయి. కాగా జిల్లాలో 640 పోస్టులకు 7వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్లోని నాలెడ్జి పార్క్ స్కూల్లో 2,600 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే రావాలని అధికారులు సూచించారు. >> ALL THE BEST
Sorry, no posts matched your criteria.