Telangana

News March 23, 2024

చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: ఎంపీ

image

కాంగ్రెస్ అధిష్ఠానం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా తనను ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని HYDలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

News March 23, 2024

చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: ఎంపీ

image

కాంగ్రెస్ అధిష్ఠానం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా తనను ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని HYDలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

News March 23, 2024

HYD: గెలిచి.. KCRకు గిఫ్ట్ ఇద్దాం: MLA

image

మల్కాజిగిరిలో BRS గెలుపు ఖాయమని ఉప్పల్ MLA బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి.. మల్కాజిగిరిని KCRకు గిఫ్ట్‌గా ఇద్దామని అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించేలా లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

News March 23, 2024

HYD: గెలిచి.. KCRకు గిఫ్ట్ ఇద్దాం: MLA

image

మల్కాజిగిరిలో BRS గెలుపు ఖాయమని ఉప్పల్ MLA బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి.. మల్కాజిగిరిని KCRకు గిఫ్ట్‌గా ఇద్దామని అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించేలా లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

News March 23, 2024

KTDM:ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో తుపాకుల మోత మోగింది. పెడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి జవాన్లు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జవాన్లు గాలిస్తున్నారు.

News March 23, 2024

HNK: బాలికపై లైంగిక దాడికి యత్నం.. సీఐ సస్పెండ్

image

బాలికపై లైంగిక దాడికి యత్నించి పోక్సో కేసులో అరెస్టయిన భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ బండారి సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి బాలికపై అత్యాచారానికి యత్నించినందుకు సంపత్‌పై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు.

News March 23, 2024

పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో కరీంనగర్ టాప్

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌‌లో భాగంగా  నిర్వహించిన పోషణ పక్షోత్సవాలు శనివారం ముగిశాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ప్రాజెక్టు, మండల, గ్రామ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.కార్యక్రమ వివరాలను సూచించే ఆన్‌లైన్‌ సైట్‌లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

News March 23, 2024

ADB: నేటితో ముగియనున్న గురుకులాల దరఖాస్తు ప్రక్రియ

image

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కొరకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా గురుకుల విద్యాలయాల సెక్రటరీ సీతాలక్ష్మీ వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 23, 2024

భువనగిరిపై వీడని పీటముడి!

image

కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ స్థానంపై పీటముడి ఇప్పట్లో వీడేల లేదు. ఇక్కడి నుంచి పోటీకి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఉన్నతస్థాయిలో చర్చలు సైతం పూర్తయ్యాయని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కిరణ్‌కుమార్‌రెడ్డికి వస్తుందా? లేదా పార్టీలోని మరో ప్రజాప్రతినిధికి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.

News March 23, 2024

సిద్దిపేట: పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలి: ఐజీ

image

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్-I ఏ.వి రంగనాథ్ సూచించారు. కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ అధికారులతో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులందరూ సమష్టిగా విధులు నిర్వహించాలన్నారు.