Telangana

News March 23, 2024

వరంగల్: కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సస్పెన్స్!

image

వరంగల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ఇక్కడ మాజీ MLA ఆరూరి రమేశ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూసున్నారు. మీ కామెంట్?

News March 23, 2024

ASF: ఈ నెల 19 మిస్సింగ్.. ప్రాజెక్ట్‌లో మృతదేహాం లభ్యం

image

ఆసిఫాబాద్‌లోని అడా ప్రాజెక్టులో ఈరోజు ఓ వ్యక్తి మృతదేహాం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తెల్లారం కంచరగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్(28) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 19న ఆటోలో బయటికి వెళ్లిన అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా ఈరోజు అడా ప్రాజెక్టులలో మృతదేహాం లభ్యమైనట్లు వెల్లడించారు.

News March 23, 2024

HYD: బాలుడి ప్రాణం తీసిన వీధి కుక్క

image

HYDలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. బాధితులు తెలిపిన వివరాలు.. HYD శామీర్‌పేట్ పరిధి పెద్దమ్మ కాలనీలో భవన నిర్మాణ మేస్త్రీ బాలు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు ప్రవీణ్ (11) ఈనెల 18న ఇంటి ముందు ఉండగా ఓ వీధి కుక్క దాడి చేసి కరిచింది. బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

News March 23, 2024

HYD: బాలుడి ప్రాణం తీసిన వీధి కుక్క

image

HYDలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. బాధితులు తెలిపిన వివరాలు.. HYD శామీర్‌పేట్ పరిధి పెద్దమ్మ కాలనీలో భవన నిర్మాణ మేస్త్రీ బాలు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు ప్రవీణ్ (11) ఈనెల 18న ఇంటి ముందు ఉండగా ఓ వీధి కుక్క దాడి చేసి కరిచింది. బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

News March 23, 2024

భద్రాద్రి కంటే ఖమ్మంలోనే ఎక్కువ..

image

ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పోలీసుశాఖ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘాను కట్టుదిట్టం చేస్తోంది. ఖమ్మంలో 83, భద్రాద్రిలో 15 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు భద్రాద్రిలో 128 ఉండగా.. ఖమ్మంలో లేవు. రౌడీ షీటర్లు ఖమ్మంలో 244, భద్రాద్రిలో 236 మంది ఉండగా.. వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

News March 23, 2024

అచ్చంపేట : అధిక రక్తస్రావం.. బాలింత మృతి

image

ఓ బాలింత మృతిచెందిన సంఘటన అచ్చంపేటలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన కల్పన (29) ప్రసవం కోసం గురువారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఓ వైద్యుడు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు. డెలివరీ అనంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నా.. బాలింతకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. జిల్లా ఆస్పత్రి నుంచి HYD గాంధీ ఆసుపత్రికి తరలించగా మరణించింది.

News March 23, 2024

నల్గొండ, భువనగిరిపై తర్జనభర్జన

image

నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ తర్జనభర్జన పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ కత్తిమీద సాములా మారింది. ఇప్పటివరకు విజయం సాధించని నల్గొండ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం కాకుండా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న స్థానాలు ఇక్కడివే కావడం గమనార్హం.

News March 23, 2024

ADB: ఫలితాలు ప్రకటించకముందే మరొక షెడ్యూల్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్-జనవరి నెలలో రాసిన 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇప్పటివరకు వెలువడలేదు. ఫలితాలు రాకముందే మరో పరీక్షల షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారంటూ డిగ్రీ విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. వెంటనే 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

News March 23, 2024

NZB: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

MBNR: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ వాసి శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న HYDలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రేయసి గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.