Telangana

News July 17, 2024

రైతు రుణమాఫీపై అనుమానాలు: మాజీ ఎమ్మెల్యే రేగా

image

రైతు రుణమాఫీపై సందేహాలున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆంక్షలు లేవంటూనే ఉత్తర్వులను సవరించడం లేదని మండిపడ్డారు. రైతుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.

News July 17, 2024

రామచంద్రాపురం: మాజీ మంత్రి హరీష్ రావును సన్మానించిన నేతలు

image

రామచంద్రాపురం డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి హరీష్ రావును మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, కృష్ణ కాంత్, పఠాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శాలువతో సన్మానించి బొకే అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీధర్ చారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

News July 17, 2024

ముథోల్: Way2 News ఎఫెక్ట్.. బస్‌స్టాండ్‌లో విద్యుత్ దీపాలు

image

విద్యుత్ దీపాలు లేక ముధోల్ బస్‌స్టాండ్‌లో వారం రోజులుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. దీనిపై Way2 Newsలో ”అంధకారంలో ముథోల్ ఆర్టీసీ బస్టాండ్” అనే శీర్షికతో కథనం ప్రచురితం అయింది. కథనానికి స్పందించిన అధికారులు బుధవారం బస్టాండ్‌లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.

News July 17, 2024

మేడిగడ్డలో పెరిగిన గోదావరి ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.

News July 17, 2024

మేడిగడ్డలో పెరిగిన గోదావరి ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.

News July 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 14.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా గుండుమల్లో 10.8 మి.మీ, గద్వాల జిల్లా గట్టులో 3.5 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా తుడుకుర్తిలో 0.5 మి.మీ, వనపర్తి జిల్లా రేమోద్దులలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 17, 2024

PDPL: తాగుడు అపేయాలన్నందుకు యువకుడి సూసైడ్

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. ఎస్సై లక్ష్మణ్ వివరాల ప్రకారం.. దొంగతుర్తి గ్రామానికి చెందిన రాజ్ కుమార్(20) మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం తాగడం ఆపేయాలని తండ్రి.. కుమారుడిని మందలిస్తూ వస్తున్నాడు. మనస్తాపానికి గురైన రాజ్ కుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News July 17, 2024

వరంగల్: ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. గీసుకొండ మండలం దస్రుతండాకు చెందిన నందు ఐనవోలు స్తూర్బాగాంధీ విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అయితే ఈనెల 9న తండ్రి కిషోర్ పనిచేస్తున్న బొల్లికుంట వాగ్దేవి కాలేజీ హాస్టల్‌కి హోంసిక్ హలీడెస్‌కు వచ్చిన నందు.. నేడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. MGMలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 17, 2024

సాగర్ కుడి కాలువకు తాగునీటి విడుదల

image

తెలంగాణ, ఏపీకి తాగు నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ బోర్డ్ అనుమతించిన నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతం పరిధిలోని కుడి కాల్వకు డ్యాం అధికారులు 5,598 క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేశారు. సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 504.40 అడుగుల నీరు నిల్వ ఉంది. HYD తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీకి 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

News July 17, 2024

ఆదిలాబాద్: డిగ్రీలో చేరే వారికి గమనిక

image

DOST ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు తమ గ్రూపు, మీడియంను మార్చుకోవడానికి అవకాశం కల్పించినట్లు ADB జిల్లా దోస్త్ కో- ఆర్డినేటర్ నర్సింగ్‌రావు తెలిపారు. దోస్త్ లాగిన్ లోకి వెళ్లి ఐడీ పిన్ నంబరును ఎంటర్ చేసి తమ గ్రూపు లేదా మీడియంను ఈ నెల 18లోగా మార్చుకోవచ్చన్నారు. గ్రూపు లేదా మీడియం మార్చుకున్న విద్యార్థులకు కొత్త గ్రూపు లేదా మీడియంను 19న కేటాయించనున్నట్లు వెల్లడించారు.