Telangana

News March 23, 2024

కోయిలకొండ: ప్రైవేట్ స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి

image

కోయిలకొండ మండలంలోని మోదీపూర్‌ గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి దాక్షాయిని(4)మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. SI రాఘవేందర్ కథనం మేరకు.. దాక్షాయిని కిరాణం దుకాణానికి వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఈక్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు ముందు టైరు పాప పైకి ఎక్కించినట్లు, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 23, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔MBNR: నేటి నుంచి అలివేలు మంగ బ్రహ్మోత్సవాలు ✔త్రాగునీటి కష్టాలపై అధికారుల ఫోకస్ ✔MBNR:నేడు మహిళా సమైక్య సమావేశం ✔ఉమ్మడి జిల్లాలో ఓటు నమోదుపై నజర్✔పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన ✔గద్వాల్, ధరూర్ మండలాలలో కరెంట్ కట్ ✔రంజాన్ వేళలు: ఇఫ్తార్(శని)-6:36, సహార్-(ఆది)-4:58 
✔MBNR,NGKL ఎంపీ అభ్యర్థుల ఖరారు.. వ్యూహాలకు కసరత్తు 
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు ✔పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’

News March 23, 2024

వరంగల్ అ.ని.శా కోర్టులో ఇదే తొలి కేసు

image

MHBD సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రూ.19,200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఐతే గతంలో అవినీతి కేసుల్లో పట్టుబడిన నిందితులను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేవారు. ఇటీవల వరంగల్‌లో ఏసీబీ కోర్టు ఏర్పాటు చేయడంతో మొదటి కేసుగా మహబూబాబాద్ రైడ్‌లో పట్టుబడిన ఇద్దరు నిందితులను ఇదే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

News March 23, 2024

KTDM: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: జిల్లా ఎస్పీ

image

మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు  ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ముందస్తుగా సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచారు. కొత్తగూడెం, భద్రాచలం,ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉన్నాయని.. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

News March 23, 2024

నిర్మల్: కుక్కల దాడిలో చిన్నారి మృతి…!

image

ఈనెల 2న వీధి కుక్కల దాడిలో గాయపడిన నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. పెంబి మండలం తాటిగూడకు చెందిన భూక్య సరిత-అమర్సేంగ్ దంపతుల కూతురు శాన్విత ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆమెకు నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్ళీ గురువారం జ్వరం రావడంతో నిర్మల్లోని ఆసుపత్రికి తరలించి అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో చిన్నారి మృతి చెందింది.

News March 23, 2024

MHBD: కొడుకూ, కూతురితో బావిలో దూకిన తల్లి

image

MHBD జిల్లాలో శుక్రవారం విషాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారు వెంకటాపురానికి చెందిన ఆకుల లావణ్య(28) కుటుంబ కలహాలతో తన కూతురు నిత్య(8), కుమారుడు ముఖేష్(10)లను బావిలో తోసి తానూ దూకింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా.. బాలుడు ముఖేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భర్త వివాహేతర సంబంధమే మహిళ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

News March 23, 2024

KNR: వడదెబ్బతో రైతు మృతి

image

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన మానకొండూర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దూరుపల్లికి చెందిన పంది జగన్(51)కు రెండెకరాల సాగు భూమి ఉంది. అందులో ఆడ-మగ వరి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పొలంలో పుద్దు దులుపుతుండగా.. ఎండ వేడి వల్ల జగన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం KNR ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.

News March 23, 2024

NLG: జిల్లాలో 5.11 లక్షల పశువులకు టీకాలు

image

పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామని NLG జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి డాక్టర్ అంబటి యాదగిరి తెలిపారు. జిల్లాలో సుమారు 2లక్షల తెల్లపశువులు, 3.11 లక్ష నల్లజాతి పశువులకు టీకాలను వేయడానికి 74 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

News March 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమం
✓చర్ల మండలంలో సంత వేలం పాట
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
✓మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

News March 23, 2024

శిశు మరణాలను నివారించాలి: డీఎంహెచ్ఓ

image

భద్రాద్రి జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాల నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్.శిరీష అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంభవించిన ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.