Telangana

News March 22, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥NGKL:BRS ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
♥సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఉమ్మడి జిల్లా నాయకులు
♥మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం:సంపత్
♥ఎన్నికల కోడ్ ముగిశాకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గృహజ్యోతి అమలు
♥WNPT:మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల రాజీనామాలకు ఆమోదం
♥నాకు ఎలాంటి నోటీసులు రాలేదు:MLA విజయుడు
♥ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
♥ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు

News March 22, 2024

పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. 30 వరకు పెన్షన్ల పంపిణీ

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందాలని.. మధ్య దళారులను నమ్మ వద్దని సూచించారు.

News March 22, 2024

‘లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి’

image

ఖమ్మం: టిఎస్‌ బిపాస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్ణీత సమయంలోగా ఆమోదించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశాన్ని మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, కలెక్టర్ నిర్వహించారు. లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News March 22, 2024

సీరోలు: ఆటో బోల్తా.. నగురికి తీవ్ర గాయాలు

image

ఆటో బోల్తాపడి నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సీరోల్ మండలంలోని కందికొండ స్టేజ్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ఆటోను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కురవికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన 108లో ఆసుపత్రికి తరలించారు.

News March 22, 2024

ధర్మపురి క్షేత్రానికి భక్తుల తాకిడి

image

పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మూడవ రోజైన నేడు వైభవంగా కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. అనుబంధ ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

News March 22, 2024

పరకాల: వెంకటాపురంలో క్షుద్ర పూజల కలకలం

image

పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ఇండ్ల ముందు కుండలు, పసుపు కుంకుమతో పాటు క్షుద్రపూజల సామాగ్రి పెట్టి ఉండటంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామానికి చెందిన సదన్ కుమార్, రమేష్ ఇద్దరి ఇంటి ముందు ఇవి ప్రత్యక్షమయ్యాయి. తమకు క్షుద్ర పూజలు చేసినట్లు, తమకు ప్రాణహాని ఉందని బాధితులు తెలిపారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News March 22, 2024

సంగారెడ్డి : వాహనాల తనిఖీల్లో రూ.5 లక్షలు స్వాధీనం

image

ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.5 లక్షల నగదును పోలీసు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం షెల్గిరా చెక్‌పోస్టు వద్ద జరిగింది. ఎన్నికల కోడ్ సందర్భంగా పోలీస్ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ కారులో రూ.5 లక్షల నగదును పట్టుకున్నారు. ఎలాంటి ధ్రువపత్రాలు చూపకపోవడంతో అధికారులు నగదును సీజ్ చేసినట్లు ఎస్సై అమ్రానాయక్ తెలిపారు.

News March 22, 2024

టికెట్ కోసం ప్రయత్నించలేదు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం

image

భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య కోమటిరెడ్డి లక్ష్మిని ఇక్కడి నుంచి బరిలో నిలిపేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఎంపీ టికెట్ కోసం తన భార్య ప్రయత్నించలేదని అన్నారు. పార్టీ ఆదేశిస్తే తన భార్య పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.

News March 22, 2024

NZB: మహిళ హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష

image

మహిళను కిరాతకంగా హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు 14 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల శుక్రవారం తీర్పు చెప్పారు. ఆర్మూర్ శివారులోని మామిడిపల్లిలో ఒంటరిగా నివాసం ఉండే బొణికే భారతి (55)ను 2018లో తోకల చిత్ర, బట్టు వెంకటేష్, పందిర్ల రాజేందర్ గౌడ్, బట్టు రంజిత్ గొంతు కోసి హత్య చేసిన అభియోగాలు నిర్దారణ కావడంతో జిల్లా జడ్జిపై మేరకు తీర్పు చెప్పారు.

News March 22, 2024

ధర్మపురి: కారును ఢీ కొట్టిన లారీ.. తప్పిన ప్రమాదం

image

కారును లారీ వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం లక్షెట్టిపేట నుంచి జగిత్యాలకు బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం ఓ ఫ్యామిలీ కారులో వెళుతుండగా ధర్మపురి వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.