India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD జవహర్నగర్ పరిధిలో కుక్కల దాడిలో <<13644434>>బాలుడు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులు నెల కిందట HYD వచ్చారు. వారి కొడుకు నిహాన్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు దాడి చేసి 20 నిమిషాలు కరిచాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి కుక్కలను తరిమాడు. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.
HYD జవహర్నగర్ పరిధిలో కుక్కల దాడిలో <<13644434>>బాలుడు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులు నెల కిందట HYD వచ్చారు. వారి కొడుకు విహాన్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు దాడి చేసి 20 నిమిషాలు కరిచాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి కుక్కలను తరిమాడు. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న బహుళవిధ కార్మికుల నిరీక్షణకు తెరపడింది. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. కార్మికుల ఖాతాల్లో సత్వరం జమచేయాలని అధికారులను ఆదేశించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లోని 1,070 గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న 2,346 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.8.98 కోట్లు అందనున్నాయి.
నిజామాబాద్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వినాయక నగర్లోని ఓ టీ హోటల్ ముందు యువకుడు రక్తపు మడుగులో చనిపోయి ఉండటాన్ని హోటల్ యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. 4వ టౌన్ పోలీసులు, నగర సీఐ నరహరి అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అతడిని మంగళవారం రాత్రి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం వరద నీరు చేరుతుండడంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు, బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో ఎస్సారెస్పీకి 5,150 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ 90.323 సామర్థ్యానికి ప్రస్తుతం 13.485 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 22.053 TMCల నీరు ఉంది.
నల్గొండ జిల్లాలో 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నేరడుగొమ్ములో 32.0 మి.మీ, అత్యల్పంగా హాలియాలో 0.1 మి.మీ వర్షపాతం నమోదయింది. చందంపేట 28.1, దామరచర్ల 23.8, త్రిపురారం 16.8, నార్కట్పల్లి 12.2, గుండ్లపల్లి 11.8, దేవరకొండ 11.5,కొండమల్లేపల్లి 8.3, కట్టంగూర్ 7.0, నల్గొండ 5.3, తిప్పర్తిలో 4.9 మీమీ వర్షం కురిసింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నెలకు ఒకసారి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాలు ఏర్పాటు చేసేవారు. 2022 నుంచి ఈ శిబిరాలు నిర్వహించడం లేదు. జిల్లా కేంద్రాల్లో పీపీ మాత్రం యూనిట్లలో అరకొరగా నిర్వహిస్తున్నారు. దీంతో అవసరమైన వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారింది.
ఉమ్మడి WGL జిల్లాలో వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. BHPLలో సాధారణ వర్షపాతం 311.7mm ఉండగా.. 307.7mm నమోదైంది. HNKలో సాధారణ వర్షపాతం 273.9mm ఉండగా.. 305.5mm రికార్డైంది. జనగామలో 232.4mm ఉండగా.. 258mm నమోదైంది. WGLలో 285.3mm సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 299mm నమోదైంది. ములుగులో 360.5mm వర్షపాతం నమోదు కావాల్సిఉండగా.. 397.5mm కురిసింది. MHBDలో సాధారణ వర్షపాతం 257mm ఉండగా.. 289.6mm నమోదైంది.
చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో 2 నెలల క్రితం జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీని సీఎం రేవంత్ కోరారు. నిన్న HYDలో కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో పోలీసులకు సూచించారు. శ్రీధర్ రెడ్డి కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోందని జిల్లా అధికారులను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
ఇన్స్టాలో పరిచయమైన బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదయింది. పోలీసుల వివరాలు..ఖానాపురానికి చెందిన 9వతరగతి బాలిక ఖమ్మంకు చెందిన ఓ యువకుడికి ఇన్స్టాలో పరిచయమైంది. దీంతో యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఇంటికి వెళ్లిన తరువాత గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాను తెలిపారు.
Sorry, no posts matched your criteria.