Telangana

News March 22, 2024

మల్హర్: ‘జెట్ విమానం ఆచూకీ తెలిసింది’

image

గత నాలుగు రోజులుగా మల్హర్, కాటారం మండలాల పరిధిలో ఆకాశంలో అత్యంత సమీపంలో చక్కర్లు కొడుతున్న జెట్ విమానం ప్రజలను అయోమయానికి గురి చేసిన విషయం విధితమే. అయితే జెట్ విమానంపై అధికారులు అరా తీయగా ఎట్టకేలకు సమాచారం తెలిసింది. ఛత్తీస్‌గడ్‌లోని కాంకేడ్ ఎయిర్ పోర్ట్ అకాడమీలో పెట్టిన ట్రైనింగ్ నేపథ్యంలో జెట్ ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిపారు. దీంతో ఊహాగానాలకు తెరపడింది.

News March 22, 2024

ADB: రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి

image

నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్ మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సవేల గ్రామానికి చెందిన డాక్టర్ రాజ్‌కుమార్ కడెం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. గత రాత్రి భుక్తాపూర్ వద్ద ఆయన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో డాక్టర్ రాజకుమార్ మృతిచెందారని కడెం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

News March 22, 2024

వాహన తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ గంజాయి

image

భద్రాచలం పట్టణంలోని వంతెన వద్ద స్థానిక పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో శుక్రవారం భారీగా గంజాయి పట్టుబడింది. అనుమానస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా 67 కేజీల ఎండు గంజాయి దిండ్లు పట్టుబడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గంజాయి విలువ సుమారు రూ.16.75లక్షలు ఉంటుందని తెలిపారు.

News March 22, 2024

ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగానికి దరఖాస్తుల స్వీకరణ

image

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అర్హత కలిగిన వారు మొత్తం 43,326 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,992 మంది, మహిళలు 20,330 మంది ఉన్నారు. వీరిలో దివ్యాంగ ఓటర్లు 33,839 మంది.. 85ఏళ్లు పైబడిన ఓటర్లు 9,487 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఓటర్లు మాత్రమే ఫారం-12డీ ద్వారా నేటి నుంచి దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి.. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అనుమతిస్తారు.

News March 22, 2024

సంగెం ఎంపీపీ పై అవిశ్వాస తీర్మాన పత్రం అందజేత

image

వరంగల్ జిల్లా సంగెం మండల ఎంపీపీ కందగట్ల కళావతి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మండలంలోని ఎంపీటీసీలు అందుకు సంభందించిన తీర్మాన పత్రాన్ని శుక్రవారం వరంగల్ ఆర్డీవో సీదం దత్తుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో వివిధ హోదాలలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికార దాహంతో పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకోవడంతోనే ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు తెలిపారు.

News March 22, 2024

వెన్నంపల్లి: గుండెపోటుతో యువకుడి మృతి

image

గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారవ.. వెన్నంపల్లి గ్రామానికి చెందిన మారుపాక మహేష్(30) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. మహేష్‌కు గురువారం రాత్రి గుండెలో నొప్పి రావడంతో హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

News March 22, 2024

WGL: మిగిలిన సీట్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయ అధికారి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సాంఘీక సంక్షేమ గురుకుల వెబ్ సైట్ tswreis.inలో పరిశీలించాలని కోరారు.

News March 22, 2024

NGKL ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్థానం..

image

అలంపూర్‌లో సవరన్న, ప్రేమమ్మ దంపతులకు 1967లో జన్మించిన RS ప్రవీణ్ కుమార్.. ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీలో చేశారు. 1995 బ్యాచ్ IPSగా ఎంపికైన RSP స్వేరోస్ సంస్థ స్థాపించి పలు కార్యక్రమాలు చేపట్టారు. గతేడాది తన ఉద్యోగానికి రిజైన్ చేసిన ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా BRSలో చేరి NGKL ఎంపీగా పోటీ చేస్తున్నారు.

News March 22, 2024

ఆదిలాబాద్ MPకి హైకమాండ్ బుజ్జగింపులు..!

image

ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాబురావుకు జాతీయస్థాయిలో నామినేటెడ్ పోస్ట్ బీజేపీ హైకమాండ్​ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటును బాబురావుకు కాకుండా బీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరిన నగేశ్‌ను ఆదిలాబాద్​ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ​సోయం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

News March 22, 2024

సీఎం రేవంత్ రెడ్డి కలిసిన జిల్లా నాయకులు

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు శుక్రవారం ఆయన చాంబర్ లో కలిశారు. మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రతాప్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల అంశంపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు.