Telangana

News March 22, 2024

వరంగల్‌లో క్రికెట్ క్లబ్

image

వరంగల్ జిల్లా యువతకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వరంగల్‌లో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. హెచ్‌సీఏ నిర్ణయంపై వరంగల్ జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 22, 2024

మల్లు రవి రాజకీయ ప్రస్థానం

image

1950లో ఖమ్మం జిల్లాలో జన్మించిన మల్లు రవి ఎంబీబీఎస్, డీఎల్వో చదివారు. భార్య రాజబన్సిదేవి , కుమార్తె అనంత శృతి, కుమారుడు సిద్దార్ధ. 1991, 1998లో రెండుసార్లు నాగర్ కర్నూల్ నుంచి MPగా గెలిచారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, అనంతరం దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయనున్నారు.

News March 22, 2024

NGKL: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కొడుకునే చంపేసింది

image

బిజినేపల్లి మండలం అల్లీపూర్‌లో కన్న <<12896690>>కొడుకుని హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రవీందర్‌, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు. అన్నలిద్దరూ హాస్టల్‌లో ఉండగా హరికృష్ణ ఇంటి వద్దే ఉంటున్నాడు. భర్త తాగుడుకు బానిస కావడంతో లక్ష్మి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తన విషయం కొడుక్కి తెలిసిందని భావించిన ఆమె హరిని చంపి సంపులో పడేసింది. లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

News March 22, 2024

KMM: రూ.3,52,133 విలువైన సామగ్రి సీజ్‌

image

లోక్‌సభ ఎన్నికల షెడ్యుల్‌ విడుదలయ్యాక ఆధారాలు లేకుండా తరలిస్తున్న వివిధ రకాల సామగ్రిని సీజ్‌ చేసినట్లు నోడల్‌ అధికారి మురళీధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గురువారం నాటికి 56 కేసులు నమోదు కాగా రూ.3,52,133విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇందులో రూ.50,400 విలువైన పీడీఎస్‌ బియ్యం, రూ.72,464 విలువైన గంజాయి, రూ.2,29,269 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

News March 22, 2024

వరంగల్: ఉరేసుకుని వాచ్ మెన్ ఆత్మహత్య

image

హనుమకొండ ఠాణా పరిధి కిషన్ పురలో వాచ్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నడికూడ మండలం చర్లపల్లికి చెందిన రాజేందర్(45) కిషన్ పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం భార్యాభర్తలమధ్యలో ఘర్షణ జరిగింది. దీంతో రాజేందర్ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన అతను గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకున్నాడు.

News March 22, 2024

ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. 23 ,26వ తేదీల్లో శిక్షణ

image

MLC ఉపఎన్నిక నిర్వహణకు పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్, POలు, APOలను నియమించాలని కలెక్టర్ రవి నాయక్ అన్నారు. వీరికి ఈనెల 23, 26వ తేదీల్లో మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇవ్వాలని, మొత్తం పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, MBNR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ఉంటుందన్నారు. అక్కడి నుంచే ఈనెల 27న పోలింగ్ సామగ్రిని ఆయా కేంద్రాలకు పంపిణీ చేస్తామన్నారు.

News March 22, 2024

బోధన్: నీటి కుంటలో పడి సూసైడ్

image

ఖాజాపూర్ గ్రామానికి చెందిన సుభద్రబాయి(83)కి మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం సాలూర శివారులోని ఓ కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం గురువారం నీటిలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 22, 2024

సిరిసిల్లలో మహిళ దారుణ హత్య

image

సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అనంత నగర్‌కు చెందిన మహిళను ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యాచారం చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో నిందితుల ఆధార్ కార్డులు, మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరిరంచి దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2024

MBNR, NGKLలో మొదలైన ఎన్నికల సందడి..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా MP ఎన్నికల సందడి మొదలైంది. నిన్న సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్-12, BRS- 2 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ బలంగానే కనిపిస్తోంది. లోక్ సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 22, 2024

ఖమ్మం: రైలు నుంచి పడి యువకుడు మృతి

image

ప్రమాదవశాత్తు రైలులో నుంచి కిందపడి ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. యువకుడి వయసు సుమారు 21 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదని పోలీసులు తెలిపారు.