India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరులో రూ.2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5,49,108 మంది రైతులు ఉండగా సుమారు రూ.2,736 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 70 శాతం మందికిపైగా రూ.లక్ష లోపు వారే. ఈనెల 18న లక్ష వరకు నగదు జమయ్యే రైతులు 3.14 లక్షల మంది ఉండొచ్చని అంచనా. అయితే ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో మాఫీ ఎవరెవరికి వర్తిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5.36లక్షల మంది రైతులు ఉండగా సుమారు రూ.7500 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రుణమాఫీ రూ.500 కోట్లు కానున్నట్లు సీఈవో శంకర్రావు పేర్కొన్నారు. దీనిపై 19న జరిగే పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు అంతంతమాత్రమే సాగుతోంది. ఇప్పటివరకు 39.35 శాతం పంటల్ని వేశారు. గతేడాదితో వర్షపాతం విషయంలో పెద్దగా మార్పులేమి లేకున్నా సాగులో మాత్రం వెనకబడింది. సాధారణంగా సాగు చేసే భూమి 15,36,907 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు సాగైంది 6,04,745 మాత్రమే. పత్తి 4,62,452, మొక్కజొన్న 37,516, వరినాట్లు 20,378 ఎకరాల్లో సాగుచేశారు.
ఉమ్మడి జిల్లాలో ఆదాయపు పన్ను రిఫండ్ పొందేందుకు కొందరు అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ రేంజ్-5 పరిధిలో తప్పుడు వివరాలు సమర్పించిన వారు 14 వేల మంది ఉంటే.. అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10,635 మంది ఉన్నారు. తప్పుడు వివరాలు సమర్పించవద్దని, అక్రమ మార్గాలు అనుసరించవద్దని ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ సుమిత సూచించారు. కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు ఆదాయపు పన్ను శాఖకు అందుతాయని అన్నారు.
HYD జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్ ఆదర్శ నగర్ కాలనీ ఫేజ్-2లో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే విహాన్ అనే బాలుడిపై మంగళవారం రాత్రి కుక్కల గుంపు దాడి చేసింది. కొన్ని కుక్కలు ఆ బాలుడి నెత్తి భాగాన్ని పీక్కుతిన్నాయి. విహాన్ జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మృతిచెందాడని స్థానికుడు నరేందర్ యాదవ్ తెలిపారు.
HYD జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్ ఆదర్శ నగర్ కాలనీ ఫేజ్-2లో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే విహాన్ అనే బాలుడిపై మంగళవారం రాత్రి కుక్కల గుంపు దాడి చేసింది. కొన్ని కుక్కలు ఆ బాలుడి నెత్తి భాగాన్ని పీక్కుతిన్నాయి. విహాన్ జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మృతిచెందాడని స్థానికుడు నరేందర్ యాదవ్ తెలిపారు.
జిల్లా ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలకరితో తోడుగా వచ్చే తొలిఏకాదశి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకువస్తుందన్నారు. అలాగే ముస్లిం సోదరులకు మొహర్రం పండుగా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు గుర్తుగా జరుపుకునే పండగ మొహర్రం అన్నారు. లౌకికవాద స్ఫూర్తికి మొహర్రం తార్కాణంగా నిలుస్తుందన్నారు.
ఓ బ్యాంకు CSP నిర్వహకురాలు మహిళా సంఘాల వద్ద రూ.45లక్షలు కాజేసిన ఘటన పొతంగల్ మం. కల్లూర్లో వెలుగుచూసింది. CSPగా పనిచేస్తున్న సంధ్య 40 మహిళా సంఘాలకు చెందిన నగదును బ్యాంకులో జమచేసేది. కాగా 9 నెలలుగా ఆ నగదును ఆమె అక్కలు, తన బావ ఖాతాల్లో జమచేసింది. అనుమానం వచ్చిన IKP CC రమ బ్యాంకు లావాదేవీలు పరిశీలించగా విషయం బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన కోటగిరి SI సందీప్ సదరు మహిళను విచారించగా నేరం ఒప్పుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు
నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో వ్యయ వివరాలు వెల్లడించని ఇద్దరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల నియామవళి ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారానికి వెచ్చించిన ప్రతీ ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కానీ పాలేరులో రామిరెడ్డి సుంకిరెడ్డి, రామసహాయం మాధవీరెడ్డి వివరాలు సమర్పించకపోవడంతో నోటీసులు పంపారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపారు.
విశాఖ, చైన్నె, నారాయణాద్రి రైళ్లకు మిర్యాలగూడలో ఈనెల 19నుంచి స్టాప్ను ఎత్తివేస్తూ రైల్వే అధికారులు ఆదేశాలిచ్చారు. కోవిడ్ సమయంలో ఈ రైళ్లకు స్టాప్ ఎత్తివేయగా EX MP ఉత్తమ్, EX MLA భాస్కర్రావు మిర్యాలగూడలో రైళ్లను నిలపాలంటూ అధికారులకు విన్నవించారు. గత ఏడాది జులై నుంచి ఆయా రైళ్లు నిలిచేలా అనుమతించారు. ఆదేశాలిచ్చేటప్పుడే ఏడాది పాటు రైళ్లు నిలుపుతామని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఏడాది పూర్తయింది.
Sorry, no posts matched your criteria.