India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోహర్రం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో చరిత్ర గల హాసన్ హుసేన్ దేవస్థానాన్ని బోథ్ ఎమ్మెల్యే ఆనిల్ జాధవ్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రుయ్యాడి గ్రామంలో మోహర్రం పండుగకు ఒక ప్రాముఖ్యత ఉందన్నారు. మతసామరస్యానికి ప్రత్యేక మోహర్రం పండుగ అని పేర్కొన్నారు.
స్కూల్ డాన్స్ మాస్టర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. HYD బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే ఒకటో తరగతి విద్యార్థినితో డాన్స్ మాస్టర్ సారా <<13637337>>రవికుమార్<<>> (33) అసభ్యంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
స్కూల్ డాన్స్ మాస్టర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. HYD బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే ఒకటో తరగతి విద్యార్థినితో డాన్స్ మాస్టర్ సారా <<13637337>>రవికుమార్<<>> (33) అసభ్యంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే క్రైస్తవ, మైనార్టీల విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి టి.దయానంద్ ఒక ప్రకటనలో కోరారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో 2024 గాను PG, PHD చేయాలనుకునేవారు స్కాలర్షిప్ మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. వివరాలకు కలెక్టరేట్లోని రూమ్ నం.222లో సంప్రదించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, BRS పార్టీ అధినేత KCRను ఆర్మూర్ నియోజకవర్గం BRS పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి పలు అంశాలపై చర్చించామని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో దారుణం జరిగింది. అమ్మమ్మపై మనవడు హత్యాచారం చేశాడు. స్థానికుల వివరాలు. ఉదయ్(24) తన అమ్మమ్మ రాంబాయి(80) వద్ద ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఉదయ్ ఆమెను మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆమెపై హత్యాచారం చేశాడు. స్థానికులు నిందితుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేంద్రమంత్రి బండి సంజయ్కి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చడంలో కేంద్రం నిబద్ధతగా వ్యవహరించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బండి పాత్ర కీలకమని అందులో పేర్కొన్నారు.
ముస్లింలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం పండుగ త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీక అని, విశ్వాసం, నమ్మకం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తుచేసుకోవటమే మొహర్రం పండుగ ప్రత్యేకత అన్నారు. మానవజాతి త్యాగం ఎంతో గొప్పదని, మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవటమే ఈ పండుగ అని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అయితే వీటిలో అత్యధికంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. మూడేళ్ల వ్యవధిలో ప్రధానంగా 565 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రమాదాల్లో 597 మంది మృత్యువాత పడగా.. మరో 1,137 మంది తీవ్ర క్షతగాత్రులు అయ్యారంటే.. ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన కడెంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాలు.. చిట్యాల్ గ్రామానికి చెందిన పందిరి గంగారాం(27) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య, తల్లి అతడిని మందలించారు. ఈ క్రమంలో ఈరోజు వారి మధ్య వాగ్వాదం జరగగా క్షణికావేశంలో గంగారాం పురుగు మందు తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులుఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.