Telangana

News July 16, 2024

వరంగల్: భారీగా పెరిగిన 341 రకం మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
ఏసీ తేజ మిర్చి సోమవారం క్వింటాకు రూ.17,700 పలకగా.. నేడు రూ.17,100 పలికింది.
అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ.14,000 ధర రాగా నేడు రూ.16,500 ధర వచ్చింది.
వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.14,500 ధర రాగా.. నేడు రూ.15,500కి పెరిగింది.

News July 16, 2024

HYD: కారులో తిప్పుతూ అత్యాచారం.. ఇద్దరి ARREST

image

అల్వాల్ <<13638517>>రేప్ కేసును<<>> పోలీసులు ఛేదించారు. మేడ్చల్ DCP కోటిరెడ్డి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలహాల నేపథ్యంలో శుక్రవారం అల్వాల్ PSలో ఫిర్యాదు చేసి వెళ్తుండగా కారులో తిప్పుతూ ముగ్గురు అత్యచారానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

News July 16, 2024

NLG: 5.36 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ!

image

రైతు రుణమాఫీకి ప్రభుత్వం ఎట్టకేలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను బ్యాంకర్లకు అప్పగించింది. రూ.2లక్షల వరకు రుణం మాఫీ కానుండగా, ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయనుంది.  ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.36 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 16, 2024

HYD: పెన్షన్ కోసం మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు

image

బ తికున్నా, చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన చెందారు. HYD ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే.రుక్నమ్మ(59)కు భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే.. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు అన్నారని వాపోయారు. తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు.

News July 16, 2024

HYD: పెన్షన్ కోసం మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు

image

బతికున్నా, చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన చెందారు. HYD ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే.రుక్నమ్మ(59)కు భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే.. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు అన్నారని వాపోయారు. తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు.

News July 16, 2024

HYD: ఆసుపత్రులకు పోటెత్తారు.. జర జాగ్రత్త..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో డెంగ్యూ, డిఫ్తీరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిలోఫర్‌లో 2 రోజుల్లో ఏడుగురు, గాంధీలో నలుగురు చిన్నారులు డెంగ్యూతో చేరారు. నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌తో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగుల రద్దీ ఎక్కువైంది. కాచి చల్లారిన నీటిని తాగాలని, వేడి ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు. 

News July 16, 2024

HYD: ఆసుపత్రులకు పోటెత్తారు.. జర జాగ్రత్త..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో డెంగ్యూ, డిఫ్తీరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిలోఫర్‌లో 2 రోజుల్లో ఏడుగురు, గాంధీలో నలుగురు చిన్నారులు డెంగ్యూతో చేరారు. నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌తో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగుల రద్దీ ఎక్కువైంది. కాచి చల్లారిన నీటిని తాగాలని, వేడి ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు. 

News July 16, 2024

నిజామాబాద్: పంచాయతీ కార్మికులకు తీపి కబురు 

image

ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

News July 16, 2024

పటాన్‌చెరు: కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ.40 వేలు మాయం

image

ప్రైవేటు కొరియర్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ.40వేలు మాయమైన ఘటన అమీన్‌పూర్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయిభగవాన్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆదివారం DTDC అనే కొరియర్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేశాడు. లింకు పంపుతున్నాను దానిలో రూ.5వేలు పంపండి కొరియర్ చేరుతుందని కస్టమర్ కేర్ ఉద్యోగి చెప్పగా డబ్బులు పంపాడు. వెంటనే ఖాతాలోని రూ.40వేలు డ్రా అయ్యాయి.

News July 16, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,350

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రైతన్నలను అయోమయానికి గురి చేస్తూ నిరాశ కలిగిస్తున్నాయి. సోమవారం రూ.7,310 పలికిన క్వింటా పత్తి.. నేడు రూ.7,350కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.