India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం బంజరపల్లి గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అతివేగంగా ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రేటర్ HYD పరిధిలో జూన్లో 7,014 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 14 శాతం రూ.కోటి పైన విలువున్న ఆస్తులే కావడం విశేషం. రిజిస్ట్రేషన్లలో గతేడాది జూన్తో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా సోమవారం వెల్లడించింది. గత నెలతో పోలిస్తే 16 శాతం పెరుగుదల నమోదైంది. జనవరి నుంచి జూన్ వరకు 39,220 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే మొదటి 6 నెలల్లో 15% పెరిగాయి.
గ్రేటర్ HYD పరిధిలో జూన్లో 7,014 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 14 శాతం రూ.కోటి పైన విలువున్న ఆస్తులే కావడం విశేషం. రిజిస్ట్రేషన్లలో గతేడాది జూన్తో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా సోమవారం వెల్లడించింది. గత నెలతో పోలిస్తే 16 శాతం పెరుగుదల నమోదైంది. జనవరి నుంచి జూన్ వరకు 39,220 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే మొదటి 6 నెలల్లో 15% పెరిగాయి.
MG యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పూర్వ విద్యార్థులకు వన్ టైం చాన్స్ ద్వారా పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కంట్రోలర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. 2011 – 12 నుంచి సంవత్సరం వారీగా అభ్యసించినవారు, 2014- 15 నుంచి 2020 వరకు సెమిస్టర్ విధానంలో చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను వారు అభ్యసించిన కళాశాలలో ఈ నెల 30లోగా అందజేయాలన్నారు.
బైక్పై ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తయిన రోడ్డు మార్గంలో ఉమ్లింగ్ లా పాస్ను చేరుకుని తిరిగొచ్చిన HYD మహిళా రైడర్ హారికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారు. బంజారాహిల్స్లో ఎమ్మెల్యే వివేక్ను హారిక కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్లింగ్ లా పాస్ (19,024 అడుగుల ఎత్తు)ను చేరుకున్న తెలంగాణ తొలి మహిళగా హారిక నిలిచి, ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం అభినందనీయమన్నారు.
బైక్పై ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తయిన రోడ్డు మార్గంలో ఉమ్లింగ్ లా పాస్ను చేరుకుని తిరిగొచ్చిన HYD మహిళా రైడర్ హారికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారు. బంజారాహిల్స్లో ఎమ్మెల్యే వివేక్ను హారిక కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్లింగ్ లా పాస్ (19,024 అడుగుల ఎత్తు)ను చేరుకున్న తెలంగాణ తొలి మహిళగా హారిక నిలిచి, ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం అభినందనీయమన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు సోమవారం GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 అర్జీలు, ఫోన్ ద్వారా మరో 8 విన్నపాలు వచ్చాయని పరిపాలన విభాగం అదనపు కమిషనర్ నళిని పద్మావతి తెలిపారు. ఆరు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి 102 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించారని, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు సోమవారం GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 అర్జీలు, ఫోన్ ద్వారా మరో 8 విన్నపాలు వచ్చాయని పరిపాలన విభాగం అదనపు కమిషనర్ నళిని పద్మావతి తెలిపారు. ఆరు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి 102 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించారని, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
నాగల్గిద్ద మండలంలోని రేఖానాయక్ తండా, చోక్లా తండా, శాంతినగర్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక్కడి టీచర్లు ఇటీవల జరిగిన బదిలీల్లో మరో చోటుకి వెళ్లారు. ఈ పాఠశాలలు దూర ప్రాంతంలో ఉండడంతో ఇక్కడికి రావడానికి టీచర్లు సుముకత చూపట్లేదు. దీంతో పిల్లలకు తమ వెంట పనులకు తీసుకెళ్లగా, మరికొందరు ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి స్కూళ్లు తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.