India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ పూర్వ 10 జిల్లాల్లో HYD, RR జిల్లాలు మినహా మిగిలిన 8 జిల్లాల్లో ఏ1 3డే లీగ్ టోర్నీకి ఎంపికైన ఏకైక జట్టు మహబూబ్నగర్ అని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. Way2Newsతో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. “తొలి సారిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జట్టు 3డే టోర్నీకి అర్హత సాధించిందని, నేటి నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు మొత్తం 11 మ్యాచ్లు ఆడాల్సి” ఉంటుందన్నారు.
>>ALL THE BEST
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. మహదేవ్పూర్ మండలం కాలేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజీలో 41,200 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజ్లో గత రెండు రోజుల నుంచి నిలకడగా వరద కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రేపు(బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మొహర్రం, తొలి ఏకాదశి పండుగ సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నామన్నారు. తిరిగి గురువారం మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని పేర్కొన్నారు.
మహిళపై <<13630752>>అత్యాచారానికి<<>> పాల్పడిన ఘటనలో అల్వాల్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆటోలో వెళ్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను ముగ్గురు కారులో తిప్పుతూ చిత్రహింస పెట్టారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అల్వాల్ పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఓ యువతి వద్ద రూ.11.21 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ యువతికి ‘కాయిన్ సీఎక్స్’ కంపెనీ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో వీడియోలకు లైక్లు కొట్టి పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామని ఉంది. మొదటగా 3 టాస్కులు చేసి పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.11.21 లక్షలు పెట్టుబడి పెట్టింది. విత్ డ్రా కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ యువతి వద్ద రూ.11.21 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ యువతికి ‘కాయిన్ సీఎక్స్’ కంపెనీ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో వీడియోలకు లైక్లు కొట్టి పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామని ఉంది. మొదటగా 3 టాస్కులు చేసి పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.11.21 లక్షలు పెట్టుబడి పెట్టింది. విత్ డ్రా కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. స్వామివారికి, అనుబంధ పరివార దేవతలకు ఉదయం అభిషేక అర్చనలు, శ్రీరుక్మిణి విఠలేశ్వర స్వామివార్లకుకు పంచోపనిషత్ ద్వారా అభిషేకం మహాపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17, 18వ తేదీల్లో అఖండ భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మహిళపై <<13630752>>అత్యాచారానికి <<>>పాల్పడ్డ ఘటనలో అల్వాల్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆటోలో వెళ్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను ముగ్గురు కారులో తిప్పుతూ చిత్రహింస పెట్టారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అల్వాల్ పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వర్షాల ప్రభావంతో జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. 2,890 క్యూసెక్కుల వరద చేరుతోంది. మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉందని పీజేపీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 7.721 టీఎంసీల నిల్వ ఉంది. నెట్టెంపాడులో ఓ పంపు ద్వారా నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు, భీమా, జూరాల ఎడమ కాల్వలకు కలిపి మొత్తం 1,806 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అటు అల్మటి ప్రాజెక్టుకు 25,123 క్యూసెక్కుల వరద వస్తోంది.
వనపర్తి జిల్లాలో సోమవారం మోస్తారు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కొత్తకోట, ఆత్మకూరు, పెబ్బేరు, అమరచింత, నారాయణపేట జిల్లాలోని నర్వలో 50మి.మీగా వర్షం పడింది. అత్యధికంగా అమరచింతలో 58.5 ఎంఎం, తక్కువగా చారకొండలో 1.3 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు పేటలో అత్యధికంగా 260.8MM, తక్కువగా నాగర్ కర్నూల్లో 199.9 ఎంఎం వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయి.
Sorry, no posts matched your criteria.